మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 24 : మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలును వేగవంతం చేసినట్లు ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి, సింగిల్విండో చైర్మన్ మద్దూరి జితేందర్రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలంలో ని సుంకరామయ్యపల్లిలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అడ్డాకుల సింగిల్విండో ఆధ్వర్యంలో ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 450మంది రైతుల నుంచి 40వేల క్విం టాళ్ల ధాన్యం సేకరించినట్లు పేర్కొన్నా రు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీ సుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో ఎంపీడీవో మంజుల, సర్పంచులు శ్రీకాంత్, మల్లికానాగరాజు, ఎంపీటీసీ రంగన్నగౌడ్, ఈసీ రమేశ్, శివప్రసాద్, భీమన్నయాదవ్ పాల్గొన్నారు.
నవాబ్పేట, నవంబర్ 24 : మండలంలోని కామారంలో గురువారం సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డైరెక్టర్ శ్రీనివాస్గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభు త్వం ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపా రు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మా జీ సర్పంచ్ నర్సింహులు, నాయకులు గోపాల్, ఎల్లప్ప, రంగయ్య, సత్యయ్య, హరికృష్ణారెడ్డి, శేఖర్రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా చర్యలు తీసుకోవాలని ఏపీఎం జీవరత్నం అన్నారు. నవాబ్పేట మండలంచౌడూర్లో ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రం నిర్వాహకులతో మాట్లాడుతూ గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని, బ్యాగులు కావాలని అడిగిన రైతులందరికీ అందజేయాలని తెలిపారు. అలాగే విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు 8రోజుల్లో రైతుల ఖాతాల్లో పడేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో నరేశ్, మహిళా సం ఘం సభ్యులు పాల్గొన్నారు.