అలంపూర్, జనవరి 25 : అలంపూర్లోని ఐదో శక్తి పీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను గురువారం సినీ నటుడు నవదీప్ దర్శించుకున్నారు. ఆయనకు ఈవో పురేందర్కుమార్ ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం ఆయన స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించగా అర్చకులు శేషవస్ర్తాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయా ధికారులు, అర్చకులు పాల్గొన్నారు.