శ్రీశైలం, మార్చి 22 : శ్రీశైల క్షేత్రంలో శోభకృత్ నామ సంవత్సర పర్వదినాన్ని పురస్కరించుకొని వెండి కొండపై వెలిసిన భ్రమరాంబ సమేత మల్లికార్జునులను రథంపై అధిష్టించి పురవీధుల్లో ఊరేగించారు. బుధవా రం సాయంత్రం ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులు ప్రత్యేక పూ జలు చేసిన అనంతరం మంగళవాయిద్యాలు, ఢమరుకనాదాల తో అశేష జనవాహిని మ ధ్య రథోత్సవం వైభవం గా సాగింది. రథోత్సవానికి ముందుగా ఆ లయ ప్రాంగణం నుంచి స్వామి, అ మ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో తోడుకుని వచ్చారు.
ఆల య సాంప్రదా యం ప్రకారం రథాంగపూజ, హోమం, రథాంగబలి కార్యక్రమం లో గుమ్మడికాయ లు, కొబ్బరికాయ లు కొట్టి స్వామి, అమ్మవార్లకు సా త్వికబలి సమర్పించారు. రథోత్సవాన్ని వీక్షించేందుకు రెండు రోజులుగా వివిధ రాష్ర్టాల నుంచి వ చ్చిన భక్తులు లక్ష మందికిపైగా వేచి ఉన్నారు. రథోత్సవంలో కోలాటం, చెక్కభజనలు, జానపద ప గటి వేషాల ప్రదర్శన, కేరళ, కథకళి, తప్పేట చిందు, కర్ణాటక జాంజ్, వీరగాసీ, కొమ్ము వాయిద్యం, కన్నడ జానపదడోలు, నంది వా యిద్యం మొదలైన వివిధ కళారూపాలతో ఆ ధ్యంతం భక్తిపార్యవశంలో సాగింది. మహోత్సవాల్లో నాల్గోరోజైన బుధవారం రాత్రి శ్రీ రమావాణి సేవిత రాజరాజేశ్వరి అలంకారం లో భ్రమరాంబదేవి భక్తులను కటాక్షించింది. అలంకార మండపంలో మహా సంకల్పాన్ని పఠించి షోడశోపచార పూజలు చేశారు.
మల్లన్న సన్నిధిలో జగద్గురు పీఠాధిపతి
భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామి దర్శించుకున్నారు. పీఠాధిపతికి ఈవో పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అన్నీ విశేష ఫలితాలే..
కొత్త ఏడాది.. అందరిలోనూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను నింపాలని ఈవో లవన్న కోరుతూ శ్రీశైల దేవస్థాన పంచాంగాన్ని ఆవిష్కరించారు. అక్కమహాదేవి అలంకారమండపంలో పంచాంగానికి పూజలు చేసిన అనంతరం దేవస్థాన ఆస్థాన సిద్ధ్దాంతి శ్రీ పండిత బుట్టే వీరభద్రదైవాజ్ఞచే సంవత్సరాంతం రాశీఫలాల వివరాణాత్మక పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహించారు.