రూ.300 కోట్లు..954 బెడ్ల సామర్థ్యం.. సుమారు 16 ఎకరాల స్థలంలో.. ఆరు అంతస్తుల అధునాతన సూపర్ స్పెషాలిటీ దవాఖానకు పునాది రాయి పడనున్నది. పాలమూరు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ స్థలంలో దవాఖాన నిర్మించనున్నారు. మహబూబ్నగర్ మెడికల్ కళాశాలకు అనుసంధానం చేస్తూ 24గంటలు ఉచితంగా వైద్య సేవలను అందించేందుకు చర్యలు తీసుకోనున్నారు. పట్నం వెళ్లకుండా జిల్లా కేంద్రంలోనే అన్ని రకాల వైద్యసేవలు అందేలా నిర్మాణం రూపుదిద్దుకోనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్ ఈనెల 4న దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన సూపర్ స్పెషాలి టీ దవాఖాన ఇప్పుడు ఉన్న కలెక్టరేట్ స్థానంలో నిర్మాణం కానున్న ది. కార్పొరేట్ స్థాయిలో దవాఖాన నిర్మించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రతిపాదించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది. ఈ బృహత్కార్యానికి ఈ నెల 4వ తేదీన సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. మెరుగైన వైద్య సేవలకు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అన్ని రకాల సేవలు పొందొచ్చు. వేల కోట్ల నిధులు వెచ్చించి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. త్వరలో కార్పొరేట్ వైద్యం అందనుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలోని పాలకొండ వద్ద రూ.51 కోట్లతో నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మించారు. దీనిని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో పాత కలెక్టరేట్ స్థలంలో సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు కానున్నది. కాగా, మెడికల్ కళాశాల, అనుబంధ దవాఖాన కోసం జీవో ఎంఎస్ నంబర్ 95, 2015 ప్రకారం రూ.450 కోట్లు నిధులు విడుదలయ్యాయి. ఇందులో రూ.150 కోట్లతో ఎదిర గ్రామ పరిధిలో మెడికల్ కాలేజీని నిర్మించారు. అయితే ఇన్నాళ్లుగా వైద్యవిద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా దవాఖానలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల్లో మిగిలిన రూ.300 కోట్లతో ఆధునిక దవాఖాన నిర్మించాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రతిపాదించారు. సివిల్ వర్కులకు రూ.250 కోట్లు, ఎక్విప్మెంట్ కోసం రూ.50 కోట్లు కేటాయించనున్నారు. దవాఖాన టెండర్ను బీపీఆర్ ఇన్ఫ్రాస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాంట్రాక్టును దక్కించుకున్నది. 18 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. అయితే, ఇప్పటికే పాత కలెక్టరేట్లోని భవనాను సంస్థకు అప్పగించారు. చుట్టూ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. దవాఖాన నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన వెంటనే పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీఎస్ఎంఐడీసీ ఈఈ జైపాల్రెడ్డి తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన మహబూబ్నగర్ పాత కలెక్టరేట్ కనుమరుగు కానున్నది. నిజాం కాలం కంటే ముందే ఈ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఎదుట టీడీపీ హయాంలో నిర్మించిన డీఆర్డీఏ భవనం కట్టారు.. కూల్చారు.. అయినా ఈ పాత కట్టడం రాజసం ఉట్టిపడేలా ఉన్నది. చిన్నచిన్న మరమ్మతులు చేశారు. ఇక్కడ ఎంతోమంది కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు ప్రజలకు సేవలందించారు. ఎంతోమంది ఇక్కడ పనిచేసి ఉన్నత పదవులు పొందారు. అలాంటి భవనం కొత్త కలెక్టరేట్ నిర్మించిన తరువాత కూల్చి.. దాని స్థలంలో ఆధునిక హంగులతో సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నారు. ఈ భవనం భవిష్యత్లో ఎంతో మందికి ప్రాణదాతగా నిలవనున్నది.
ఇక నుంచి చిన్న చిన్న రోగాలకు హైదరాబాద్ పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే నిరంతరం వైద్యసేవలందేలా సూపర్ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నాం. కొత్త కలెక్టరేట్ నిర్మించాక పాత భవనం నిరుపయోగంగా ఉం టుందని అందరూ భా వించారు. కానీ, పా త భవనాన్ని మ రిపించేలా దవాఖానను డిజైన్ చేశాం. ఆ రు అంతస్తుల్లో అన్ని రకాల వైద్య సే వలు అందేలా తీర్చిదిద్దుతున్నాం. సీ ఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
– శ్రీనివాస్గౌడ్, పర్యాటక శాఖ మంత్రి