మహబూబ్నగర్, మార్చి 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శాసనమండలి ఉపఎన్నిక ఉత్కంఠను రేపుతున్నది. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. పోలింగ్ నిర్వహించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రవినాయక్ మంగళవారం పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,439 మంది ఓటర్లు ఎమ్మె ల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు అంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమతమ ప్రజాప్రతినిధులను శిబిరాలకు తరలించాయి. కాంగ్రెస్ శిబిరంలో ఉన్న కొం తమంది ప్రజాప్రతినిధులు తప్ప తాగి చిందులు వేయడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అధికార పార్టీ ప్రలోభాలకు గురిచేస్తున్నది. భారీ ఎత్తున డబ్బులను ఎర చూపుతున్నట్లు ప్రజాప్రతినిధుల బంధువులకు ఫోన్ చేసి ఒత్తిడి చేస్తున్నట్లు స మాచారం. శాసనమండలి ఉపఎన్నికలు ఇరుపార్టీలకు పరీక్షగా మారాయి. కాగా సంఖ్యాబలంలో ఎక్కువ ఉ న్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఊహించని విధంగా అధికార పార్టీని చిత్తు చేయాలని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
మహబూబ్నగర్ శాసనమండలి ఉపఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలోని పది కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా, డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ కేంద్రంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో ఆ వివరాలను ఇప్పటికే పోలింగ్ అధికారులకు అందజేశా రు. బ్యాలెట్ పద్ధతిన నిర్వహించే ఎన్నికల్లో ప్రాధాన్యతా క్రమంలో ఓటు చేసే అవకాశం ఉన్నది. కాగా, మొదటి, రెండో ప్రాధాన్యత ఓట్లపై దృష్టి సారించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న శా సనమండలి ఉప ఎన్నికలకు ఆయా జిల్లాల పోలీస్ ఉ న్నతాధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144సెక్షన్ విధించారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నతాధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కలిగిన ప్రజాప్రతినిధులను మాత్రమే అనుమతించనున్నారు. రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలిం గ్ కేంద్రాలతోపాటు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్లను సీల్ చేసి ఉమ్మడి జిల్లా కేంద్రంలోని కౌంటింగ్ హాల్కు భారీ బందోబస్తు మధ్య తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో అధికారం చేపట్టాక తొలి ఉపఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురి చేసే అవకాశం కనిపిస్తున్నది. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసైనా సరే గెలవాలనే ఉద్దేశంతో ఏకంగా పారిశ్రామికవేత్తను రంగంలోకి దింపింది. దీంతో ఓటుకు రూ.లక్షలు ప లుకుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాగా కాంగ్రెస్, బీజేపీ ప్రజాప్రతినిధులు గోవా టూర్లో ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తప్పతాగి డ్యాన్సు లు చేస్తున్న ఈ వీడియోలపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపఎన్నిక ద్వారా ఎలాంటి సంకేతం ఇస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ మాజీ మం త్రులు, ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా అ డుగులు వేస్తున్నారు.
మహబూబ్నగర్ శాసనమండలి ఉపఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యే లు భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతల ప్రలోభాలకు గురికాకుం డా తమ ప్రజాప్రతినిధులందరినీ బీఆర్ఎస్ నేతలు శిబిరాలకు తరలించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పర్యవేక్షణలో అధికార పార్టీని ఎలా ఢీకొనాలి అనేదానిపై చర్చలు జరుపుతున్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేలకు ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. దీంతో వారి పర్యవేక్షణలో ప్ర జాప్రతినిధులను ప్రలోభాలకు గురి కా కుండా అధికార పార్టీకి చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ నాయకులు సిద్ధమవుతున్నా రు. ఎమ్మెల్సీని గెలిపించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బహుమతిగా అందించాలని, ఇందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు, అభ్యర్థికి మధ్య ఉన్న విభేదాలు కలిసి వస్తాయని భావిస్తున్నారు.