ఉండవెల్లి, డిసెంబర్ 28 : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. మండలంలోని బైరాపురం, బస్వాపురం గ్రామాల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి ఎ మ్మెల్యే విజయుడు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దరఖాస్తు స్వీకరించే వద్ద హెల్ప్ డెస్క్లు, 100 కుటుంబాల కో కౌంటర్తోపాటు ఉచిత వైద్య శిబిరం, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు కూడా జనవరి 6 వరకు గ్రామాల్లో అధికారులకు దరఖాస్తులు అందిచవచ్చన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేను సర్పంచులు పూలమాల, శాలువాతో సన్మానించారు.
ఎమ్మెల్యేకు వినతుల వెల్లువ..
తన రెండు కాళ్లు పని చేయకపోవడంతో ట్రైసైకిల్తో జీ వనం ఇబ్బందిగా ఉందని, మూడు చక్రాల మోటర్ సైకిల్ను ఇప్పించాలని బస్వాపురం గ్రామానికి చెందిన నర్సిం హ ఎమ్మెల్యే విజయుడును కోరారు. అధికారులతో మా ట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బైరాపురం, బస్వాపురం గ్రామాల మధ్య కొనసాగుతున్న బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి భీమేశ్వరరావు, తాసీల్దార్ వెంకట్రావ్, ఎంపీడీవో ఆంజనేయరెడ్డి, వైస్ ఎంపీపీ దేవన్న, సర్పంచులు మహేశ్వరమ్మ, శివరాం, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.