మహబూబ్నగర్ : వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కలిసి వినపతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన కౌకుంట్ల మండల కేంద్రం నుంచి అడ్డాకుల వరకు వయా పెద్ద మునుగుచెడ్ ఇశ్రంపల్లి హైవే వరకు డబుల్ రోడ్ & బ్రిడ్జి ను మంజూరు చేయాలన్నారు.
అలాగే భూత్పూర్ మండలం నుంచి వయా లంబడికుంట తండ, కర్వెన కురుమూర్తి రాయి రిజర్వాయర్ వరకు డబుల్ రోడ్డు ను మంజూరు చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి డబుల్ రోడ్డు కు సంబంధించి త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు.