మక్తల్ టౌన్, ఏప్రిల్ 9 : మహబూబ్నగర్, నా రాయణపేట జిల్లాల్లోని ఆయా గ్రామాల్లో ప్రజలు ఉగాది పర్వదినాన్ని మంగళవారం ఆనందోత్సవా ల మధ్య ఘనంగా జరుపుకొన్నారు. ఉగాది సందర్భంగా మక్తల్ మండలం భూత్పూర్ ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్ర త్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు పం చాంగ శ్రవణం చదివి వినిపించారు. నల్లజానమ్మ ఆలయం వద్ద వీకేఆర్ ఫౌండేషన్ అధినేత బాలకృష్ణారెడ్డి అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఆల య అర్చకుడు భీమ్సేన్ రావు పాల్గొన్నారు.
జడ్చర్ల, ఏప్రిల్ 9 : జడ్చర్ల మున్సిపాలిటీతోపా టు మండలంలో మంగళవారం ఉగాది పండగను (క్రోధి నామ సంవత్సరాన్ని) ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. రైతులు ఉగాది రోజు తమతమ వ్యవసాయ పనిముట్లను శుభ్రం చేసి అందంగా అలంకరించి తెల్లవారు జామునే తమతమ పొలాలకు వెళ్లి పొలం దగ్గర వ్యవసాయ పనులను ప్రా రంభించారు. అదేవిధంగా గ్రామాలు, పట్టణాల్లో సాయంత్రం వివిధ ఆలయాల వద్ద వేదపండితు లు పంచాంగం చదివి వినిపించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
జడ్చర్ల మున్సిపాలిటీలోని నేతాజీచౌక్లో ఉగా ది పర్వదినం సందర్భంగా మంగళవారం హిందూ వాహిణి ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశా రు. కార్యక్రమంలో ప్రాంత సంపర్క్ ప్రముఖ్ రా జుగౌడ్, పట్టణ కన్వీనర్ మణిరత్నం, సంతోష్, నా గరత్నం, రమేశ్, మహేశ్, నిఖిల్ ఉన్నారు.
ఊట్కూర్, ఏప్రిల్ 9 : ఉగాది కొత్త సంవత్సరంలో ప్రజలకు శ్రమ ఫలితాలతో అంతా శుభం కలుగుతుందని వేద పండితుడు హరి సర్వత్తమాచారి అన్నారు. స్థానిక గోశాల హనుమాన్ ఆలయంలో ఉగాది ‘శ్రీ క్రోధి నామ’ వేడుకలను మం గళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా వేద పండితుడు భక్తులకు పంచాంగాన్ని వినిపించి ఉగాది పర్వదిన ప్రత్యేకత గురించి వివరించారు. క్రోధి నామ సంవత్సరంలో అన్నిరంగాల వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, దేశం పాడి పంటలతో తులతూగుతుందన్నారు. పూజా కార్యక్రమానికి హాజరైన భక్తులకు పచ్చడి వితరణ చేశా రు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడకులు నిర్వహించారు. కార్యక్రమంలో పీఏసీసీఎస్ చైర్మన్ బాల్రెడ్డి, మాజీ ఎంపీపీ మణెమ్మ, మా జీ సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి, ఆల య కమిటీ సభ్యు లు లక్ష్మారెడ్డి, నర్సింహారెడ్డి, గోపాల్రెడ్డి ఉన్నారు.
కృష్ణ, ఏప్రిల్ 9 : మండలంలోని ఆయా గ్రా మాల్లో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. పండితులు పంచాంగా న్ని చదివి వినిపించారు. కొ త్త సంవత్సరంలో తమ పేర్లపై ఉన్న బలబలాలు, మంచి చెడులు, ఆదాయ వ్యయాలు, రాజ పూజ్యం విషయాలను చెప్పించుకున్నారు.
నారాయణపేట రూరల్, ఏప్రిల్ 9 : మండలంలోని సింగారం, జాజాపూర్, కొల్లంపల్లి, కోటకొండ, భైరంకొండ, పేరపళ్లతోపాటు తదితర గ్రామా ల్లో మంగళవారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జాజాపూర్ ఆర్యసమాజంలో హోమం నిర్వహించి ధ్వజరోహణం చేశారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భవాని మంది రం వద్ద భక్తులకు పచ్చడి పంపిణీ చేశారు.
నవాబ్పేట, ఏప్రిల్ 9 : మండలకేంద్రంతోపా టు వివిధ గ్రామాల్లో మంగళవారం ఉగాది పర్వదినాన్ని వైభవంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా గ్రామాల్లో రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం అన్ని గ్రామాల హనుమాన్ ఆలయాల వద్ద వేదపండితులు పం చాంగం చదివి వినిపించారు. అదేవిధంగా ప్రజల కు ఉగాది పచ్చడి పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
రాజాపూర్, ఏప్రిల్ 9 : తెలుగు నూతన సంవత్సర వేడుకలు మంగళవారం మండల ప్రజలు ఘ నంగా జరుపుకొన్నారు. కొత్త సంవత్సరం తమ జీవితాలు బాగుండాలని ఆయా గ్రామాల్లో ప్రజ లు ప్రత్యేక పూజలు చేశారు. రైతులు వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి పనులు ప్రారంభించా రు. ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో వేదపండితు లు పంచాంగం చదివి వినిపించారు.
మరికల్, ఏప్రిల్ 9 : మండల కేంద్రంలో యు వక మండలి ఆధ్వర్యంలో మంగళవారం హనుమన్వాడ ఆంజనేయస్వామి ఆలయం వద్ద పండితులతో పంచాంగ శ్రవణం నిర్వహించారు అంతకుమందు గ్రామ పంచాయతీ కార్యాలయం నుం చి ఊరేగింపుగా ఆంజనేయస్వామి ఆలయానికి గ్రామస్తులు తరలివచ్చారు. అనంతరం ఆర్ఎస్ఎస్, భగరంగ్దళ్, విశ్వహిందూ పరిషత్, యువక మండలి ఆధ్వర్యంలో పచ్చడి పంపిణీ చేశారు.
ధన్వాడ, ఏప్రిల్ 9 : మండలంలోని ఆయా గ్రా మాల్లో పండితులు పంచాంగ శ్రావణం వినిపించారు. భక్తులకు పచ్చడిని పంపిణీ చేశారు. రైతులు ఉగాది పండుగతో తమ వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు.
మిడ్జిల్, ఏప్రిల్ 9 : మండలంలో ప్రజలు తెలు గు సంవత్సరాది ఉగాది పండుగను ఘనంగా జరుపుకొన్నారు. మండల కేంద్రంతో పాటు వాడ్యాల్, బోయిన్పల్లి, కొత్తపల్లి, చిల్వేర్ తదితర గ్రామాల్లో వివిధ ఆలయాల్లో ప్రజాప్రతినిధులు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయం వద్ద పూజారులు పంచాంగం చదివి వినిపించారు.
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 9 : పట్టణంలోని ఆయా ఆలయాల్లో వేద బ్రాహ్మణులు పంచాంగ శ్రవణం చేశారు. కొత్త సంవత్సరం కావడంతో త మ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని రాశిఫలాలు చూయించుకున్నారు. పట్టణంలోని శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో బ్రాహ్మణులు ఉగాది పండుగ ప్రాముఖ్యతను తెలియజేసి పంచాంగ శ్రవణం చే శారు. శ్రీరాఘవేంద్ర స్వామి ఆలయంలో జోషి రఘుప్రేమాచారి పంచాంగ శ్రవణం చదివారు.
గండీడ్, ఏప్రిల్ 9 : ఉగాదిని పురస్కరించుకుని ఆలయాల్లో బ్రాహ్మణులు పంచాంగ శ్రవణం చేశా రు. వెన్నాచేడ్లో రచ్చబండ వద్ద యువజన సం ఘాల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి తయారు చేసి గ్రామస్తులకు పంపిణీ చేశారు. హనుమన్ ఆల యం వద్ద శకటోత్సవం నిర్వహించారు.
పాలమూరు, ఏప్రిల్ 9 : మహబూబ్నగర్ రూ రల్ మండలం మన్యంకొండ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం ఉగాది సందర్భంగా స్వామివారి అలంకరణ చేసి ప్రత్యేక పం చామృతాభిషేక పూజలు, పారాయణం నిర్వహించారు. వాల్మీకి రామాయణం, బాలకాండ పారాయణం శ్రీరామనవమి వరకు చేపట్టనున్నట్లు ఆల య ధర్మకర్త మధుసూదన్కుమార్ తెలిపారు. వేద పండితులతో ఉగాది పంచాంగ శ్రవణం వినిపించారు. అలాగే మహబూబ్నగర్లోని సింహగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పద్మావతి శ్రీనివాసస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
టీడీ గుట్ట తిరుమలనాథ స్వామి ఆ లయం, టీచర్స్కాలనీ రామాలయం, వీరన్నపేట శివాలయంలో, రేణుకా ఎల్లమ్మ ఆలయం, ద్వారకామాయి సాయిబాబా మందిరం, న్యూగంజ్ శివాలయంలో, కాటన్మిల్ వెంకటేశ్వరస్వామి ఆ లయంలో, భగీరథకాలనీ ఆంజనేయస్వామి ఆలయంతో పాటు పలు దేవాలయాల్లో భక్తులు ప్రత్యే క పూజలు చేశారు. అనంతరం పండితులు పం చాంగ శ్రవణం చేశారు. కార్యక్రమంలో అళహరి రామకృష్ణ, శ్రీనివాసరాజు పాల్గొన్నారు.
నర్వ ఏప్రిల్ 9 : మండల కేంద్రంతోపాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ఉగాది పండుగ ను ఘనంగా నిర్వహించారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పండితులు పంచాంగ శ్రవణం వినిపించారు. రైతులు వ్యవసాయ పరికరాలకు, పశువులు, ట్రాక్టర్లకు పూజలు నిర్వహించి వ్యవసాయ పనులు చేపట్టారు. ఎంపీపీ జయరాములు, జెడ్పీటీసీ జ్యోతికిరణ్, ప్రకాశ్రెడ్డి, వైస్ ఎంపీపీ వీణావతి శంకర్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, తాసీల్దార్ మల్లారెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో సుదర్శన్, ఎస్సై కురుమయ్య తదితరులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
మహ్మదాబాద్, ఏప్రిల్ 9 : ఉగాది సందర్భంగా ఆలయాల్లో మంగళవారం పంచాంగ శ్రవణాన్ని పండితులు వినిపించారు. మహ్మదాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రయాణికులకు నాయకు డు వేణుగౌడ్ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. నంచర్లలో హనుమాన్ ఆలయ అభివృద్ధి కోసం జ మలాపూర్ యాదోజీ రూ.51వేల చెక్కును ఆల య కమిటీ సభ్యులకు అందజేశారు.