నారాయణపేట రూరల్, నవంబర్ 15 : నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తానని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని కొల్లంపల్లిలో ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు బ్రహ్మరథం పట్టారు. అలాగే బోయిన్పల్లితండా, బోయిన్పల్లి, చిన్నజట్రం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. వృద్ధులు, మహిళలు, యువతను ఆప్యాయంగా పలుకరిస్తూ కారుగుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధిని గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. అంతేకాకుండా గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా పదేండ్లలోనే ఊహించని అభివృద్ధి చేసినట్లు వివరించారు.
తెలంగాణలో అమలు చేసే సంక్షేమ పథకాలు మరెక్కడా లేవని, పేదలపై సీఎం కేసీఆర్కు అమితమైన ప్రేమ ఉందన్నారు. ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే నష్టపోతామని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. అనంతరం మండలంలోని కొల్లంపల్లికి 30మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో హాజీమే స్త్రీ, షాయెద్, ఎండీ జలీల్, ఇబ్రహీం, ఆశ న్న, నర్సింహులుతోపాటు 25 మంది ఉ న్నారు. బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధికి ఆకర్షితులమై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అం జలి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్ సాయిరెడ్డి, ఎంపీటీసీ దామోదర్రెడ్డి, జెడ్పీ కోఆప్షన్ తాజుద్దీన్, ఉపసర్పంచ్ వడ్డెప్ప, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వే పూరిరాములు, మైనార్ట్టీ మండలాధ్యక్షుడు అలీశేర్, ఉపాధ్యక్షుడు ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.