నారాయణపేట, జూన్ 17 : గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ రూ.53వేల కోట్లు మంజూరు చేసి తండాలను అభివృద్ధి చేశారని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి వెల్లడించారు. ముంబయిలోని విష్ణుదాస్ భవే ఆడిటోరియంలో శనివారం ఆత్మీయ సమ్మేళనంలో నా రాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ముఖ్య అతిథిగా హా జరయ్యారు. పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తల డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా వెళ్లి ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. అనంతరం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. ముంబయి, పూణే, బెంగళూరు, సూరత్ వంటి మహానగరాల్లో స్థిరపడి వివిధ రంగాల్లో రాణిస్తున్న నారాయణపేట జిల్లాకు చెందిన ప్రజలు, మహారాష్ట్ర, కర్నాటకలో బీఆర్ఎస్ బలోపేతం కోసం ముందుకు రావాలని కోరారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గిరిజన దినోత్సవాన్ని ముంబయిలో నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో పెద్ద ఎత్తున ఆదరణ వస్తున్నదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్దికి పెద్దపీట వేశారన్నారు. తెలంగాణలో ఒకేసారి 3,146 తండాలను గ్రా మ పంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు. 6శాతం ఉ న్న రిజర్వేషన్ 10శాతానికి పెంచడం జరిగిందన్నారు. కల్యాణలక్ష్మి పథకంతో 1.55లక్షల మందికి రూ.13కోట్ల అందించామన్నారు. తొమ్మిదేండ్లలో మారిన తండాలను చూసి గిరిజనులు హర్షిస్తున్నారని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో పాలమూరు కరువు జిల్లాగా మారి ఎంది వలసలు వెళ్లారని, ప్రస్తుతం చేపట్టిన అభివృద్ధితో ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వలసలు వస్తున్నారని వివరించారు. పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు.
హైదరాబాద్లోని బంజారాహిల్స్లో రూ.10కోట్లలో సేవాలాల్ భవనం నిర్మించుకున్నామని, ప్రతి జిల్లాలో సేవాలాల్ భవనాలు నిర్మిస్తున్నామన్నారు. కోయిల్కొండ, నారాయణపేటలో రూ.2కోట్లతో సేవాలాల్ భవనాలు నిర్మిస్తున్నట్లు వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి చేసి రైతుల కాళ్లు కడుగుతామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నా యకుడు సంతోష్దాదా చౌదరి, హరిబౌ రాథోడ్, బీఆర్ఎస్ ముంబయి అధ్యక్షుడు అవిష్శుక్ల, వాశి సెక్టార్ బీఆర్ఎస్ అధ్యక్షుడు రాజు కమతర్, విజయ్, మహిళా అధ్యక్షురాలు సంగీత సింగడే, ఉపాధ్యక్షురాలు లక్ష్మీకాంత్ స తే, నారాయణపేట నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు రవికుమార్, మురళీధర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మల్లయ్యయాదవ్, రాజవర్ధన్రెడ్డి, మహేశ్, బుల్లెట్రాజు, సింధుచౌహాన్, రమేశ్నాయక్, మాధవరెడ్డి పాల్గొన్నారు.