కోస్గి, డిసెంబర్ 7 : బల్దియాలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అ న్నారు. అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్తో కలిసి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మున్సిపాలిటీలో పర్యటించారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో బుధవారం పర్యటించి అభివృద్ధి పనులపై కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. గ్రంథాలయ భవన నిర్మాణం పనులు గురువారం నుంచి ప్రారంభించాలన్నారు. రూ.కోటి వెచ్చిం చి నిర్మిస్తున్న గ్రంథాలయ భవనం ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చేలా పనులు వేగవంతం చేయాలన్నారు. అ నంతరం పంచతంత్ర పార్క్, నర్సరీ స్థలాన్ని పరిశీలించా రు. నర్సరీ పక్కన షెటిల్ కోర్టు ఏర్పాటు చేయాల ని ఆధికారులను ఆదేవించారు. నర్సరీ వద్ద పాత మొక్కలను తొలగించేటప్పుడు ప్లాష్టిక్ కవర్లు లే కుండా శుభ్రం చేయాలని కమిషనర్ పూర్ణచందర్ ను ఆదేశించారు.
పట్టణంలో నిర్వహించే రోడ్డు విస్తరణ పనులు కూడా త్వరగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కమిషనర్ను ఆదేశించారు. పట్టణంలో నిర్వహించే అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వ హిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం లక్ష్మీవేంకటేశ్వర శివసాయి అయ్యప్ప ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో మున్సిపాలిటీ నిధులు రూ.5లక్షలతో భక్తుల సౌకర్యార్థం టైల్స్ వేయించాలని, మొక్కలు పెంచాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రామకృష్ణ, మున్సిపల్ చైర్పర్సన్ శిరీష, పీఏసీసీఎస్ చైర్మన్ భీంరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు హనుమంత్రెడ్డి, పా ర్టీ పట్టణ అధ్యక్షుడు రాజేశ్, నాయకులు పాల్గొన్నారు.