నాగర్కర్నూల్, మార్చి 30 : మీ బలం, బలగం వల్లే కందనూలు అభివృద్ధి సాధ్యపడిందని, గెలిపించినందుకు మీరు తలెత్తుకొని గర్వంగా చెప్పుకొనేలా సేవా కార్యక్రమాలు చేపడుతానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే 53వ పుట్టినరోజు వేడుకలను జిల్లా కేంద్రంలో గు రువారం రాత్రి అభిమానుల మధ్య జరుపుకొన్నారు. బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన వేదిక వ ద్ద అభిమానులు భారీ గజమాలతో సన్మానించా రు. భారీ కేక్ను కట్ చేశారు. మినీ ట్యాంక్బండ్పై విజయవాడకు చెందిన సామల ముఖేష్ చిత్రీకరించిన ఎమ్మెల్యే సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నూతనంగా ప్రారంభించిన సూపర్ ల గ్జరీ బస్సులో ట్యాంక్బండ్కు చేరుకొని సామల ముఖేష్ను సన్మానించారు. అనంతరం క్యాంప్ కా ర్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 53 మంది నిరుపేద విద్యార్థులకు, 53 మంది మైనార్టీ మహిళలకు రూ.5 వే ల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.
బస్టాండ్ కూడలిలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఎమ్మెల్యే మాట్లాడారు. రెండు సార్లు తనను గెలిపించినందుకు ఎంతో అభివృద్ధి చేశానని, మున్ముందు మీ సహకారం ఉంటే మరింత డెవలప్మెంట్ చేస్తానన్నారు. మంత్రి పదవి వద్దని.. ముఖ్యమంత్రి కేసీఆర్తో మెడికల్ కళాశాలను సాధించానన్నారు. గ తంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వారు మంత్రి పదవులను అనుభవించినప్పటికీ పట్టించుకోలేదన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే ఇంజినీరింగ్ కళాశాల సాధనకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రఘునందన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కల్పన, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ హన్మంత్రా వు, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, మున్సిపల్ వైస్చైర్మన్ బాబురావు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.