తిమ్మాజిపేట, ఏప్రిల్ 22 : గ్రామస్తులంతా ఐకమత్యంగా ఉండాలని నాగర్కర్నూల్ ఎమ్మె ల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు. శనివారం మండలంలోని పుల్లగిరిలో జరుగుతున్న బొడ్రాయి ఉత్సవాలకు ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో, బొడ్రాయికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మర్రి మాట్లాడుతూ బొడ్రాయి వంటి గ్రామ దేవతల పండుగలను నిర్వహించుకోవడం వల్ల ఐక్యత పెరుగుతుందన్నారు. గ్రామం ప క్కనే కరివెన రిజర్వాయర్ నిర్మిస్తున్నామని, ఇది పూర్తయితే ఈ ప్రాంతమంతా సుభిక్షంగా మారుతుందని, భూముల ధర రె ట్టింపు అవుతాయన్నారు. అనంతరం మండల కేంద్రంలోని జె డ్పీ స్కూల్ ఆవరణలో ప్రజలతో కలిసి బలగం సినిమాను తిలకించారు.