నాగర్కర్నూల్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : నాగర్కర్నూల్ నియోజకవర్గానికి నిధుల వెల్లువ కొనసాగుతున్నది. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్ర త్యేక చొరవతో సీఎం కేసీఆర్ సహకారంతో ని యోజకవర్గానికి నెల వ్యవధిలో రూ.166 కోట్లు మంజూరు కావడంతో ప్రజలు హర్షిస్తున్నారు.
నెలలో రూ.166కోట్ల నిధులు
నాగర్కర్నూల్ నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా చేపట్టేందుకు ఎమ్మెల్యే మర్రి చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో పెండింగ్లో ఉన్న పనులతోపాటు కొత్తగా చేపట్టబోయే పనులకూ నిధుల కొరత లేకుండా చేస్తున్నారు. సీఎం గత పదేండ్లలో నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరుగుతున్నది. ఇందులో ఎమ్మెల్యే మర్రిదే ప్రధాన పాత్ర. ఇప్పటికే జిల్లా ఆవిర్భావం, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, మెడికల్, అగ్రికల్చర్ కళాశాలలు, డయాగ్నొస్టిక్ కేంద్రం, మినీ ట్యాంక్బండ్ వంటి ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి కేవలం నెల వ్యవధిలోనే నియోజకవర్గానికి రూ.166కోట్లు మంజూరు చేయించడం విశేషం. తొలుత రూ.50కోట్లు విడుదలవగా పక్షం రోజుల కిందట మరో రూ.55కోట్లు.. తాజాగా రూ.60కోట్లు కేటాయించారు.
ఈ నిధులతో గ్రామాల్లో సీసీలు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాలు, జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈక్రమంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందడి నెలకొన్నది. ఎమ్మెల్యే నియోజకవర్గానికి రాగా ఆయా గ్రామాల ప్రజలు తరలొచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈక్రమంలోనే అభివృద్ధికి ఆకర్షితులవుతున్న ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ముందుకొస్తుండడంతో క్యాంపు కార్యాలయం రద్దీగా మారుతోంది. మంజూరైన నిధుల్లో రూ.30కోట్లతో బీటీ రోడ్లు, మరో రూ.30కోట్లతో సీసీలు నిర్మించనున్నారు. శిథిలావస్థకు చేరిన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనానికి రూ.5 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలో రూ.5కోట్లతో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రూ.5కోట్లతో తి మ్మాజిపేటలో జంక్షన్ అభివృద్ధి, సెం ట్రల్ లైటింగ్, డివైడర్ను నిర్మించనున్నారు. పట్టణంలో రూ.65కోట్లతో అండర్ డ్రైనేజీ పను లు చేపడుతుండగా, విలీన గ్రామాలు, శివారు ప్రాంతాల్లోనూ అండర్ డ్రైనేజీ పనులకు అదనంగా రూ.25కోట్లు మంజూరయ్యాయి. సైన్స్ భవనానికి రూ.కోటి, సమీకృత మార్కెట్ సముదాయంలో అదనపు పనులకు రూ.4కోట్లు, గుడిపల్లిలో డ్రైనేజీ పనులకు రూ.65లక్షలు మంజూరయ్యాయి. కాగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి చేపడుతున్న అభివృద్ధిపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అభివృద్ధే నా ఎజెండా
రాష్ట్రంలో నాగర్కర్నూల్ను ప్రత్యేక స్థానంలో నిలపడమే నా ఎజెండా. డబ్బు, పదవి, రాజకీయాలు శాశ్వతం కాదు. ప్రజలకు సేవ చేస్తే మన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. సీఎం కేసీఆర్ సహకారంతో రాజకీయాలతో సంబంధం లేకుండా పనులు చేస్తున్నా. ఈ అభివృద్ధి చూసి మేధావులు, ఉద్యోగులు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అభినందిస్తున్నారు. ఇంకా ఎన్ని నిధులైనా తీసుకొచ్చి అభివృద్ధికి సహకరిస్తా. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు నాగర్కర్నూల్కు సేవ చేస్తాను.