మూసాపేట, జనవరి 5 : అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నిజాలపూర్లో ప్రజాపాలన కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల ను అమలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. పేదలను ఆదుకోవాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ బ్రహ్మంగౌడ్, ఎంపీడీవో స్వరూప, సర్పంచ్ గడ్డం సత్యమ్మ, ఎంపీటీసీ గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి సురేశ్కుమార్ పాల్గొన్నారు.
దేవరకద్ర, జనవరి 5 : నియోజకవర్గ కేం ద్రంలోని ఆర్వోబీకి ఇరువైపులా సబ్ రోడ్డును ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్రె డ్డి ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్టీసీ, ఆర్అండ్బీ అధికారులతో ప్ర త్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ మండల కేంద్రంలో ఆర్వోబీ ని ర్మాణం చేపట్టి సబ్ రోడ్డులు నిర్మాణం చేయకపోవడంతో ఆర్టీసీ బస్సులు బస్టాండ్లోకి రా కపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారన్నారు. ఆర్వోబీకి ఇరువైపు లా సబ్రోడ్డు నిర్మాణం చేపటేందుకు ప్రణాళికలపై చర్చించారు. ైప్లెఓవరుపై నుంచి బస్సు లు దిగి అక్కడి నుంచి నేరుగా బస్టాండ్లోకి ప్రతి బస్సు వచ్చే విధంగా అర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే, అధికారు లు, నాయకులు ైప్లెఓవరు వద్ద బస్సు వెళ్లే రో డ్డును పరిశీలించారు. తర్వలో ైప్లెఓవర్కు సబ్ రోడ్డు నిర్మాణం చేపడుతామని ఆర్అండ్బీ అధికారులు ఎమ్మెల్యేకు సూచించారు. కార్యక్రమంలో మహబూబ్నగర్ ఆర్టీసీ డీపో మేనేజర్ సుజాత, ఆర్అండ్బీ అధికారులు, నాయకులు ఉన్నారు.
భూత్పూర్, జనవరి 5 : ప్రభుత్వ పాఠశాలల్లో విధులను నిర్వహిస్తున్న ఉపాధ్యాయు లు తప్పనిసరిగా సమయపాలన పాటించాల ని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పీఆర్టీయూ(టీఎస్) 2024 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ సమాజంలో ఎంతో పవిత్రమైన వృత్తి ఉ పాధ్యాయ వృత్తి, పేద విద్యార్థుల ఉన్నతికోసం సమయ పాలనను పాటించాలని ఆయన సూ చించారు. కార్యక్రమంలో పీర్టీయూ జిల్లా అ ధ్యక్షుడు రఘురాంరెడ్డి, యాదయ్య, సత్తూర్ బాలరాజుగౌడ్, జీహెచ్ఎం ఆనందమ్మ ఉపాధ్యాయ సంఘం సభ్యులు పాల్గొన్నారు.