నవాబ్పేట, జూలై 17 : సీఎం కేసీఆర్ అందిస్తున్న మూడు పంటల కరెంటు కావాలో లేక కాంగ్రెస్ నా యకులు చెప్పిన మూడుగంటల కరెంటు కావాలో రైతులు ఆలోచించుకోవాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. టీపీసీసీ ఛీప్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కాకర్లపహాడ్ రైతువేదికలో సో మవారం రైతు సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యే ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. రైతులకు 24 గంటల కరెంటు సరఫ రా చేయడం తమకు చేత కాదని, 3గంటల కరెంటు మాత్రమే సాగుకు సరఫరా చేస్తామని కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని వివరించారు. సీఎం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి సాధించిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రైతుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వాన్ని రైతులే కాపాడుకోవాలని కోరారు.
వివిధ గ్రామాలకు చెందిన రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా త రలిరావడంతో రైతు వేదిక ప్రాంగణమంతా జనసంద్రంగా మారిం ది. మారుమూల పల్లెలో పెద్ద ఎత్తున రైతులు తరలి రావడంపై ఎంపీ, ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. వారి రాక సందర్భంగా మహిళలు బతుకమ్మ ఆడి అలరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ముడా డైరెక్టర్ చెన్నయ్య, సర్పంచులు జంగమ్మ, లలితమ్మ, వసుంధర, లక్ష్మమ్మ, బాలరాజు, గోపాల్గౌడ్, యాదయ్యయాదవ్, రైతుబంధు గ్రామ కోఆర్టినేటర్లు కృష్ణగౌడ్, శ్రీనివాస్రెడ్డి, నర్సింహు లు, మాజీ ఎంపీపీ శీనయ్య, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, యాదయ్య, అబ్దుల్లా, నవనీతరావు, శ్రీ ను, గోపాల్, రఘు, చెన్నయ్య, వెంకటేశ్
తదితరులు పాల్గొన్నారు.