జడ్చర్ల/నవాబ్పేట/బాలానగర్, అక్టోబర్ 20 : కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి లక్ష మెజార్టీ అందించే దిశగా కృషి చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. జడ్చర్ల పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాదేపల్లి, కావేరమ్మపేటకు చెందిన 50 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. అలాగే నవాబ్పేట మండలంలోని కారూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నారెడ్డిపల్లి, మల్లారెడ్డిపల్లి, కారూర్ గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు శుక్రవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చెన్నారెడ్డిపల్లికి చెందిన 25 మంది, మల్లారెడ్డిపల్లికి చెందిన 15 మంది, కారూర్కు చెందిన 20మంది నాయకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అలాగే బాలానగర్ మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గౌతాపూర్ గ్రామానికి చెందిన 10 మంది బీఎస్పీ నాయకులు రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో, ఉడిత్యాల గ్రామానికి చెందిన 10 మంది కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీ ప్రదీప్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గడచిన పదేండ్లల్లో సర్కారు చేపట్టిన అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి.. కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక సర్కారు బీఆర్ఎస్సే అని అన్నారు. జడ్చర్ల పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కట్ అవుతుందని గ్రహించిన ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జడ్చర్ల కౌన్సిలర్లు ప్రశాంత్రెడ్డి, మహేశ్, పీఏసీసీఎస్ చైర్మన్ మల్లేశ్, రామ్మోహన్, బాలకృష్ణ, చెన్నకేశవులు, బాలానగర్ వైస్ ఎంపీపీ వెంకటాచారి, విండో డైరెక్టర్ నాగిరెడ్డి, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి, సర్పంచ్ రాంరెడ్డి, నవాబ్పేట ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, సర్పంచులు గోపాల్గౌడ్, యాదయ్యయాదవ్, లక్ష్మారెడ్డి, నాయకులు నర్సింహులు, రాంప్రసాద్, నాగిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, భోజయ్యచారి తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, అక్టోబర్ 20 : ప్రతిఒక్కరూ దైవచింతన అలవర్చుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దాయపల్లిలో బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగలు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. గ్రామ దేవత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరూ కలిసికట్టుగా బొడ్రాయి ప్రతిష్ఠాపన ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటాచారి, సిం గిల్ విండో డైరెక్టర్ నాగిరెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గోపాల్రెడ్డి, స ర్పంచ్ శంకర్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షు డు రాజు, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, నా యకులు లక్ష్మయ్య, శివానందరెడ్డి, భూ పాల్, మనోహర్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, నర్సింహులు, విష్ణువర్ధన్రెడ్డి, ప్రవీణ్రెడ్డి, ని జాం, లింగం, జనార్ధన్ ఉన్నారు.