మహబూబ్నగర్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతులకు మేలు చేకూర్చే ప్రభుత్వాలు కావాలా..కా ర్పొరేట్లకు కొమ్ముకాసే సర్కార్ కావాలా తెలుసుకోవాల్సిన అవసరం అసన్నమైందని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో శుక్రవారం బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుమేరకు రైతు మహాధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దేశంలో కార్పొరేట్ కంపెనీలకు రూ.11లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్రం రై తులకు రూ.లక్ష కోట్ల రుణాలు మాఫీ ఎందుకు చేయలేకపోతున్నదని ప్రశ్నించారు. నల్లచట్టాలను తీసుకొచ్చి..ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు ఆందోళనలు నిర్వహించాక రైతులు క్షమాపణ చెప్పి ఈ చట్టాలను వెనక్కి తీసుకున్న మా ట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కండ్లు మండిన కేం ద్రం రైతులు కల్లాలు ఏర్పాటు చేసుకుంటే దాని డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ నోటీసులు పంపించడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఎన్నో ఏండ్లుగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుబం ధం చేయాలని ఎన్ని లేఖలు రాసిన పట్టించుకోవడం లేదని, కేంద్రం రైతు వ్యతిరేకి ప్రభుత్వంగా మారిందని ఆరోపించా రు. దేశంలో మోదీ విధానాలను వ్యతిరేకించే ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ అని, అందుకే తెలంగాణపై కేంద్రం కక్షగట్టిందన్నా రు. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమా లు దేశ వ్యాప్తం చేయాలని డిమాండ్ చేయడంతో భయపడి న కేంద్రం ఇలాంటి చర్యలకు పూనుకుంటుదన్నారు. ఇటీవ ల బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి అబ్ కా బార్ కిసాన్ సర్కార్’ అని పిలుపు ఇవ్వడంతో భయపడి న బీజేపీ నేతలు ఇలాంటి చౌకబారు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి అధ్యక్షుడు గో పాల్యాదవ్, బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్గౌడ్, కేసీ న ర్సింహులు, అల్లిపురం వెంకటేశ్వర్రెడ్డి, రాజేశ్వర్, జెడ్పీటీసీ రాజేశ్వరి, అబ్దుల్ రహెమాన్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మహాధర్నా
పాలమూరు, డిసెంబర్ 23 : బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపుమేరకు మంత్రి డా.వి.శ్రీనివాస్గౌడ్ ఆదేశాల మేరకు పట్టణంలోని తె లంగాణ చౌరస్తాలో రైతులపై కేంద్రం వైఖరి మార్చుకోవాలని రైతు మహాధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో రైతుబంధు జి ల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్ మాట్లాడు తూ కేంద్రం రైతులపై వ్యవహరిస్తున్న తీ రును మార్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌ డ్, రైతుబంధు జిల్లా డైరెక్టర్ నర్సింహారెడ్డి, రైతుబంధు మం డలాధ్యక్షుడు దేవేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుదీప్రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సింగిల్విండో డైరెక్టర్లు, బీఆర్ఎస్ కౌన్సిల ర్లు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘల నాయకులు, మండల నాయకులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
రైతు మహాధర్నాకు తరలిన శ్రేణులు
దేవరకద్ర రూరల్, డిసెంబర్ 23 : రైతు కల్లాలపై నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా శుక్రవారం జిల్లాకేంద్రంలో చేపట్టిన రైతు మహాధర్నా కార్యక్రమానికి కౌ కుంట్ల, చిన్న చింతకుంట మండలాల బీఆర్ఎస్ శ్రేణులు పె ద్దఎత్తున తరలివెళ్లారు. ఎమ్మెల్యే ఆల ఆదేశాల మేరకు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ మండల అధ్యక్షులు, కార్యకర్తలు జెండాలతో వెళ్లారు.
జిల్లాకేంద్రానికి తరలిన నాయకులు
నవాబ్పేట, డిసెంబర్ 23 : రైతు కల్లాలపై కేంద్ర ప్రభు త్వం చూపుతున్న వివక్షను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతు మహాధర్నాకు మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివెళ్లారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య, వైస్ఎంపీపీ సం తోష్రెడ్డి, నాయకులు నాగిరెడ్డి, కృష్ణగౌడ్, శ్రీను, సర్పంచు లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
రైతులపై నిర్లక్ష్యం వద్దు
రాజాపూర్, డిసెంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు శుక్రవారం జిల్లాకేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు మండలానికి చెందిన శ్రే ణులు తరలివెళ్లి నిరసన చేపట్టారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, యూత్ వింగ్ అ ధ్యక్షుడు వెంకటేశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు న ర్సింహులు, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు బచ్చిరె డ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్యకర్తలు తరలివెళ్లారు.