జడ్చర్ల, అక్టోబర్ 10 : ఈ నెల 18వ తేదీన సీఎం కేసీఆర్ జడ్చర్లకు రానున్నారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఇందుకుగానూ మంగళవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బహిరంగ సభా స్థ లాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ జడ్చర్ల మున్సిపాలిటీ శి వారులోని శివాలయం సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగసభ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక ఉమ్మడి జిల్లాలో సీఎం కేసీఆర్ నిర్వహించే మొట్టమొదటి ఎన్నికల బహిరంగ సభ కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 2018 ఎన్నికల సమయంలో కూడా అక్కడే సీఎం కే సీఆర్ సభ నిర్వహించామన్నారు.