నవాబ్పేట, అక్టోబర్ 14 : రాషాన్ని 70 ఏండ్లు పా లించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు కనీసం తా గునీరు కూడా ఇవ్వలేదని, వారికి ఓటేస్తే పాపమే తగులుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని లక్ష్మీనర్సింహ రైస్ మిల్ ఆవరణలో శనివారం బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులతో సీఎం సభ ఏర్పాట్లపై శనివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ సమైక్య పాలనలో తాగునీటి కోసం ప్రజల నుంచి వచ్చే ఒత్తిడి తట్టుకోలేక సర్పంచులు తీవ్ర ఇబ్బందులు పడేవారని ఇప్పు డు అలాంటి పరిస్థితులు ఎక్కడా లేవన్నారు.
రైతులకు కనీసం ఎరువులు కూడా ఇవ్వలేని కాంగ్రెస్ దద్దమ్మలు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరడం హాస్యాస్పదమన్నారు. పోలీసుల పహారాలో ఎరువులు పంపిణీ చేసిన సంగతి మరిచిపోవాలా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి గడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. గ్రామాల్లో రోడ్లన్నీ బీటీ, సీసీలుగా మారాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జడ్చర్ల నియోజకవర్గంలోని 200 తండాల్లో కేవలం 2 చోట్ల మాత్రమే వాటర్ ట్యాంకులు ఉండేవని, ఇప్పడు ప్రతి తండాలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి దాహార్తి తీరుస్తున్నామన్నారు. భవిష్యత్ తరాల కోసం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం గెలవాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్ర సాధన కోసం తాను ఎమ్మెల్యే పదవినే త్యాగం చే శానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి అ భ్యర్థే గతి లేడని.. ఇక ఆరు గ్యారెంటీ స్కీంల కథ దేవుడెరుగని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా రెపరెపలాడాలని, లేదంటే గాడి త ప్పి ఎడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. నవాబ్పేట మండలం నుంచి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 8 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీ వచ్చిందని.., ఈ సారి 20 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు. 18న జడ్చర్లలో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు మండలం నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. అనంతరం కేశరావుపల్లి గ్రా మానికి చెందిన 40 మంది, దర్పల్లికి చెందిన 15 మం ది, కాకర్లపహాడ్కు చెందిన 10 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు.
సమావేశంలో ఎంపీపీ అ నంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మ య్య, వైస్ చైర్మన్ చందర్నాయక్, వైస్ ఎంపీపీ సంతోష్రెడ్డి, ముడా డైరెక్టర్ చెన్నయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీపీ శీనయ్య, మాజీ జెడ్పీటీసీలు ఇందిరాదేవి, స్వరూప, మై సమ్మ ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణయ్య, సర్పంచులు గో పాల్గౌడ్, సత్యం, యాదయ్య, వెంకటేశ్, నాయకులు రాంప్రసాద్, పురుషోత్తం, నాగిరెడ్డి, కృష్ణగౌడ్, సంజీవరెడ్డి యూత్వింగ్ అధ్యక్షుడు శ్రీను తదితరులున్నారు.