గద్వాల, ఫిబ్రవరి 20 : కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి అన్నారు. గద్వాల మండలం బీరెల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దుబ్బ బీసన్న విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. దీంతో పార్టీ ఆధ్వర్యంలో ప్రమాద బీమా కింద రూ.2లక్షల చెక్కు మంజూరు కాగా మృతుడి భార్య బాలమ్మకు క్యాం ప్ కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందు చూపుతో కార్యకర్తలకు ఏదైనా ఆపద సంభవిస్తే కుటుంబం రోడ్డున పడకూడదనే మంచి ఆలోచనతో కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించారని చెప్పారు. దీని స్ఫూర్తితోనే రైతుబీమా, చేనేతబీమా తదితర సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా ప్రవేశపెట్టి ఆ కుటుంబాలకు చేయూత ఇచ్చినట్లు గుర్తుచేశారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో నాయకు లు రమేశ్నాయుడు, బీచుపల్లి, రాజు ఉన్నారు.
మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్ లక్ష్మి భర్త నర్సింహులు గుండెపోటుతో మంగళవారం మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నర్సింహులు మృతదేహంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ కేశవ్ తదితరులు ఉన్నారు.