తిమ్మాజిపేట, మే 16 : యుద్ధ ప్రాతిపదికన పాఠశాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదేశించారు. మండలంలోని ఎదిరేపల్లి గ్రా మంలో డీఎంఎఫ్టీ నిధులు రూ. 50లక్షలతో చేపడుతున్న పాఠశాల నిర్మా ణ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం ప్రా రంభంలోగా భవననిర్మాణం పూర్తి చే యాలని, పనులు నాణ్యతగా చేపట్టాల ని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించా రు. అంతకుముందు అమ్మపల్లి వెళ్లే దా రిని పరిశీలించారు. ఆయన వెంట ఎం పీపీ రవీంద్రనాథ్రెడ్డి, వైస్ఎంపీపీ శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, సర్పంచుల సం ఘం మండల అధ్యక్షుడు వేణుగోపాల్గౌడ్, ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు కిల్లే మల్లయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హుస్సేని, నాయకులు నాగరాజుగౌడ్, సుజీత్కుమార్రెడ్డి, చెన్నయ్య ఉన్నారు.
టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ నేతలు
తెలకపల్లి, మే 16 : మండలంలోని అనంతసాగర్కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ అందిస్తున్న సుపరిపాలన చూసి చాలామంది ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నా రు. పార్టీలో చేరిన వారిలో వెంకటయ్య, రాము, కృష్ణ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మ న్ హనుమంతురావు, టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, సర్పంచ్ విష్ణు తదతరులు పాల్గొన్నారు.