‘నేను మీ బిడ్డను.. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అచ్చంపేట ప్రజల కోసమే బతుకుతా.. చస్తే ఈ ప్రాంత ప్రజల కోసమే చస్తా.. అంతే కానీ ప్రజాసేవను వీడను.. పెత్తందారులంతా ఒక్కటయ్యారు.. ఎలాగైనా నన్ను ఓడించి తీరుతారట.. వాళ్ల అక్రమ దందాలను అడ్డుకున్నందుకు, వారి పెత్తనానికి మద్దతు పలకనందున నన్ను ఓడించేందుకు ఎన్ని డబ్బులైనా ఖర్చుపెట్టి ఓడిస్తారట.. కాంగ్రెస్ నాయకులు గ్యారెంటీ స్కీంల పేరుతో మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారు. వారి కపట మాటలు నమ్మి మో సపోతే గోసపడతాం.. అచ్చంపేటను ఆగం చేస్తారు.. అందుకే మరోసారి మీ దీవెనలు అందించండి, మీకు సేవకు డినై పనిచేస్తా..’ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రకటించారు.
అచ్చంపేట, అక్టోబర్ 20 : నేను మీ బిడ్డను.. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అచ్చంపేట ప్రజల కోసమే బతుకుతా.. చస్తే అచ్చంపేట ప్రజల కోసేమ చస్తా.. అంతే కాని ప్రజాసేవను వీడను.. పెత్తందారులు, హైదరాబాద్లో ఉండేవారు, ఒక్కటయ్యారు.. ఎలాగైన నన్ను ఓడించి తీరుతారట.. వాళ్ల అక్రమ దందాలను అడ్డుకున్నందుకు, వారి పెత్తనానికి మద్దతు పలకనందుకు నన్ను ఓడించేందుకు ఎన్ని డబ్బులైనా ఖర్చుపెట్టి ఓడిస్తారట.. దయచేసి ప్రజలు గమనించాలి. ప్ర శాంతంగా ఉన్న అచ్చంపేటను దోపిడీదారులు, కుట్రదారులు చేతిలో పెట్టి ఆగం కానివ్వొద్దని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం అచ్చంపేట నియోజకవర్గంలోని వం గూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మూడోసారి ఎన్నికల బరిలో నిలిచి బీఫారం అందుకొని ప్రజల్లోకి వెళ్తున్న గువ్వల బాలరాజును ప్రజలు అక్కున చేర్చుకుంటున్నారు. ఊరూరా గులాబీ జెండాకు జై కొడుతున్నారు. పేదల బిడ్డ గువ్వల బాలరాజును గెలిపించుకుంటామని బాహటంగా చెబుతున్నారు. గువ్వలపై పూలు చల్లి బతుకమ్మ, కోలాటాలతో స్వాగతం పలుకుతూ అభిమానం చాటుకుంటున్నారు. ఏ గ్రామం లో చూసినా గులాబీ పార్టీకి వృద్ధులు, మహిళలు, రైతు లు, సబ్బండవర్గాలు మద్దతుగా నిలబడుతున్నారు. సచ్చినా సీఎం కేసీఆర్కే ఓటేస్తామని మహిళలు ప్రకటిస్తున్నారు. గువ్వల ప్రజలను కలుస్తూ పేరు పేరున పిలిచి పలకరించారు. వృద్దులు, వయస్సు మగ్గిన వారి వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. జయించి వస్తావు పో బిడ్డ అంటూ దీవించి పంపించారు. బొట్టు పెట్టి తిలకం దిద్ది మహిళలు ఆశీర్వచనలు అందించారు. ఎప్పుడు పేదల కోసం ఆలోచించే గువ్వల బాలరాజు బిడ్డను గెలిపించుకుంటామని ప్రజలు బాహటంగా ప్రకటిస్తున్నారు.
వంగూరు, అక్టోబర్ 20 : మూడోసారి నన్ను ఆశీర్వదిస్తే మీ సేవకుడై ఉంటూ కుటుంబానికి పెద్దదిక్కునై సేవలందిస్తానని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని కోనేటిపూర్, తిప్పారెడ్డిపల్లి, గాజర, నిజాంబాద్, ఉమ్మాపూర్, ఉప్పల్పహాడ్ గ్రామాల్లో విప్ గువ్వల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణాలు కాంగ్రెస్ వైపు ఉంటే అగ్రవర్ణాలలోని పేదలు, దళితతులు, బడుగు బలహీన వర్గాలతోపాటు మైనార్టీలు నా వెంట ఉన్నారన్నారు. వారు డబ్బులను నమ్ముకుంటే, నేను నిజాయితీని, పనిని నమ్ముకున్నానన్నారు. వారు ఆరు గ్యారెంటీ స్కీంల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారని, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. వంగూరు మండలంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 30వేల ఎకరాలకు సాగు నీరు అందించానని మరికొన్ని గ్రామాల్లో మరో 12వేల ఎకరాలకు సాగు నీరు అందేలా కృషి చేస్తానన్నారు. నేడు మండలంలోని అన్ని గ్రామాల రోడ్లను బీటీగా మార్చడమే కాకుండా గ్రామాల్లో వీధులన్నీ సీసీలుగా మారి అద్దంలా మారాయన్నారు. వందల కోట్లతో అచ్చంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని, ఇది చూసి ప్రతిపక్షాల కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. కొందరు స్వార్థపరులు పార్టీ మారినంత మాత్రాన ఒరిగేదేమీలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పేద మహిళలకు నెలకు రూ.3 వేలను అందించడంతో పాటు వంటగ్యాస్ రూ.400 అందిస్తామన్నా రు. అచ్చంపేటలో మరోసారి కారు గుర్తును గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా అందించాలని కోరారు.
వంగూరు మండలంలోని చౌదర్పల్లి,ఉమ్మాపూర్ గ్రామాల్లో 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు శుక్రవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన విప్ గువ్వల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చౌదర్పల్లిలో కాంగ్రెస్కు చెందిన 20 మంది కార్యకర్తలు మండల నాయకుడు నాగేశ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఉమ్మాపూర్లో కాంగ్రెస్కు చెందిన అంకూరి రవితో పాటు మరో పది మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా వీరికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్విండో చైర్మన్ సురేందర్రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మ న్ రాజేందర్రెడ్డి, లాలుయాదవ్, సురేందర్ ఉన్నారు.