అమ్రాబాద్, జూన్ 15 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధిని చూ సి ప్రతిపక్షాల నాయకులు ఓర్వలేకపోతున్నారని, వారికి ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రభుత్వ వి ప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పిలుపునిచ్చారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువా రం అమ్రాబాద్ మండలం బీకే తిర్మలాపూర్ గ్రా మంలో పల్లెప్రగతి దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విప్ గువ్వలకు మహిళలు కోలాటాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గువ్వల మాట్లాడారు.
తెలంగాణ రూపురేఖలు మార్చడమే బీఆర్ఎస్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. తొమ్మిదేండ్లల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఆసరా పింఛన్లు, కేసీఆర్ కిట్లు, హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, గ్రామాల్లో శానిటైజేషన్, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామా లు, ఇంకుడుగుంతలు, సైడ్డ్రైన్లు, వీధివీధిన సీసీ రోడ్ల నిర్మాణాలు వంటి తదితర అభివృద్ధి పనులకు స్థానికులు సహకారం అందించడంతో గ్రా మాలు సర్వాంగసుందరంగా మారాయన్నారు.
రాష్ట్రంలో మూడోసారి గులాబీ జెండా ఎగరాలని, ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేయాలని కో రారు. అమ్రాబాద్, పదర మండలాలను యురేనియం పేరుతో కేంద్రం కొల్లగొట్టాలని చూస్తే 2014కు ముందే తిరగబడి ప్రజలకు బాసటగా నిలిచి వాహనాలను అడ్డుకున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల మ ద్దతు ఉందన్నారు. అనంతరం గ్రామపంచాయతీ సిబ్బందిని సన్మానించారు.
అలాగే గ్రామంలో శివాలయానికి రూ.5 లక్షలు, ఎల్లమ్మ ఆలయాని కి రూ.5 లక్షల నిధులను మంజూరు చేశారు. కా ర్యక్రమంలో సర్పంచులు ముత్తమ్మ, శారద, శ్రీ రాంనాయక్, గీత, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్రెడ్డి, చెన్నకేశవులు, ఎల్లప్ప, డీఎల్పీవో వెంకటయ్య, ఎంపీడీవో రామ్మోహన్, అధికారు లు, నాయకులు, ప్రజలు తదితరులున్నారు.