అచ్చంపేట, నవంబర్ 28: ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం సాయంత్రం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. టీచర్స్ కాలనీ ఎమ్మెల్యే నివాసగృహం నుంచి మసీద్ వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణం మొత్తం గులాబీమయంగా మారింది. మహిళలు భారీగా పాల్గొన్నారు.
గువ్వల సతీమణి అమలతో కలిసి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రోడ్షోలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, ఎన్నికల ఇన్చార్జి ఇంతియాజ్, మున్సిపల్ చైర్మన్ నరసింహాగౌడ్, మారెట్ కమిటీ చైర్పర్సన్ అరుణ, స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.