అచ్చంపేటరూరల్, ఏప్రిల్ 9 : గడపగడపకూ సం క్షేమ పథకాలు అందుతున్నాయని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం బీఆర్ఎస్ మండల-2 ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్ గువ్వల మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో తొమ్మిదేండ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించామన్నారు. స్వరాష్ట్రంలో పారదర్శకంగా పథకాలు అమలవుతున్నాయన్నారు. మండలంలోని 27 ఉమ్మడి గ్రామ పంచాయతీల నుంచి సమ్మేళనానికి తరలివచ్చిన బీఆర్ఎస్ కుటుంబసభ్యులను చూస్తే కడుపునిండుతున్నదన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానన్నారు.
వైద్యరంగంలో అనుభవం ఉన్న ఈ ప్రాంత ప్రతిపక్ష నేత, మాజీ ఎమ్మెల్యే వంద పడకల దవాఖానపై రాజకీయాలు చేయడం హాస్యాస్పదమన్నారు. సీఎం కేసీఆర్ కృషితో వంద పడకల దవాఖాన మంజూరైందన్నారు. సాగునీటి కోసం రూ.240 కోట్లతో ఉమామహేశ్వర, చెన్నకేశవ రిజర్వాయర్లకు పరిపాలన అనుమతితో జీవో విడుదల చేయించామన్నారు. రిజర్వాయర్ కింద భూములు కోల్పోయిన రైతులను ఉసిగొల్పి పనులకు ఆటంకం కలిగిస్తున్న ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మండలంలోని అన్ని గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక బడ్జెట్ నుంచి దాదాపు రూ.200 కోట్లతో ప్రళాణికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ గువ్వల అమల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మండలాధ్యక్షుడు రాజేశ్వర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, వైస్ చైర్మన్ శైలజారెడ్డి, మా ర్కెట్ కమిటీ చైర్మన్ అరుణ, పార్టీ మండలాధ్యక్షుడు పర్వతాలు ముదిరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతియాదవ్, ఎంపీపీ శాంత, జెడ్పీటీసీ మంత్య్రానాయక్, సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ నారమ్మ, విండో డైరెక్టర్లు, నాయకుడు ప్రతాప్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.