మాగనూర్, అక్టోబర్ 29 : పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవ గాహన కల్పించాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఉన్నదని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మం డల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మ క్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి ఆంజనేయులుగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చిపోయే వాళ్లను ప్రజలు నమ్మరని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధికి ఇంటింటికీ వెళ్లి వివరించాలని కోరారు. సమావేశంలో రైతుబంధు సమితి సభ్యురాలు సుచరిత, మాగనూర్ బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, జెడ్పీటీసీ వెంకటయ్య, సింగిల్ విండో చైర్మన్ వెంకట్రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు అశోక్గౌడ్, రైతు సమన్వయ సమితి సభ్యుడు మధుసూదన్రెడ్డి, నాయకుడు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.