కొల్లాపూర్, మార్చి 27 : వైద్య రంగానికి సీఎం కేసీఆర్ సర్కార్ పెద్దపీట వేసిందని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తెలిపారు. మండలంలోని రామాపూర్ మాతాశిశు సంరక్షణ సెంటర్లో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 40 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారన్నారు. వీరంతా డయాలసిస్ చేసుకునేందుకు నాగర్కర్నూల్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాలకు వెళ్లే పరిస్థితులు ఉండేవన్నారు. కిడ్నీ రోగులకు వ్యయ, ప్రయాసల నుంచి విముక్తి కలిగించేందుకు డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. కేంద్రాన్ని మంజూరు చేయాలని కోరిన వెంటనే మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, నిరంజన్రెడ్డిలకు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యేను వైద్యులు సన్మానించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో సుధాకర్లాల్, జిల్లా దవాఖాన సమన్వయ అధికారి డాక్టర్ రమేశ్చంద్ర, అదనపు డీఎంహెచ్వో వెంకట్దాస్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ కిషన్నాయక్, మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు నిరంజన్, రామాపురం సర్పంచ్ భారతీయాదవ్, ఎంపీటీసీ వరలక్ష్మీయాదవ్, దవాఖాన అభివృద్ధి కమిటీ చైర్మన్ జంబులయ్య, నాయకులు గాలియాదవ్, సత్యనారాయణయాదవ్, అంకిరావుపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.