కేటీదొడ్డి, ఫిబ్రవరి 14 : మండలంలోని గువ్వలదిన్నెలో నూతనంగా నిర్మించిన గ్రామదేవత మైసమ్మ అవ్వను బుధవారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎలప్పుడూ ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.
ఆయన వెంట ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ రాజశేఖర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, చక్రధర్రావు, వెంకటేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.