కేటీదొడ్డి, మార్చి 8 : మండల కేంద్రంలోని శివాలయంలో మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన శివపార్వతుల కల్యాణానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం మండలంలోని చింతలకుంట గ్రామంలో ప్రతిష్ఠించిన వాల్మీకి మహర్షిని కూడా దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు కలిసిమెలిసి ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్, వైఎస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఉరుకుందు,
నాయకులు ఉన్నారు.