గట్టు, మార్చి 20: పక్క రాష్ర్టాల అభివృద్ధిని తెలంగాణతో పోల్చిచూస్తే ప్రతిపక్షాలకు అభివృద్ధి ఏమిటనేది తెలుస్తుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. మండలంలోని మిట్టదొడ్డిలో సోమవారం ని ర్వహించిన ‘బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే బండ్ల ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమైందన్నారు. వలసలకు నిలయమైన గట్టు అభివృద్ధికి నోచుకుందన్నారు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అ న్నారు. అన్నివర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నా రు. రైతుబంధు, రైతుబీమాతో రైతాంగానికి చేయూతనిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పె త్తందారులకు వత్తాసు పలుకుతూ పేదల నడ్డి విరుస్తుందని ఎమ్మెల్యే బండ్ల మండిపడ్డారు. ఎన్నికల సమయం ఆసన్నమైనందున రకారకాల వేషాలతో కొత్త బిచ్చగాళ్లు వస్తుంటారని, వారిని నమ్మొద్దని హితవు పలికారు. పనిలేని ప్రతిపక్షాల మాటలు వింటే మళ్లీ గోస పడుతారనే విషయాన్ని మరువొద్దని హెచ్చరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే అభివృద్ధి చేసేవారు ఎవరూ లేరని, ప్రజ లు ఈ విషయాన్ని గ్రహించి మసలుకోవాలన్నారు. ప్ర భుత్వ ప్రగతి, పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ముందుకు తీసుకెళ్తే మంచి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని పార్టీ శ్రేణులు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ షడ్రిక్, కన్జ్యూమర్ ఫోరం మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మార్కెట్యార్డు చైర్మన్ శ్రీధర్గౌడ్, రైతుబం ధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, గ్రంథాలయ సం స్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ బాసుశ్యామల, పీఏసీసీఎస్ చైర్మన్ క్యామ వెం కటేశ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, స ర్పంచ్ బాసు హనుమంతు తదితరులు పాల్గొన్నారు.