గద్వాల, ఏప్రిల్ 25 : దేశమంతా బీఆర్ఎస్ పా ర్టీ, సీఎం కేసీఆర్ వైపే చూస్తున్నదని, తెలంగాణ పా లన దేశమంతా వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ జోగుళాంబ గద్వాల జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు.జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్సీ రవీందర్రావు మాట్లాడుతూ సోషల్ మీడియా ను బీజేపీ నాయకులు వికృతంగా వాడుకుంటున్నారన్నారు. చంద్రబాబు వంటి కరుడుగట్టిన సమైక్యవాది నోటి వెంట జై తెలంగాణ అనిపించిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. 70 ఏండ్ల గోసను కేవలం తొమ్మిదేండ్లలోనే తీర్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు.
దేశం మొత్తం యాసంగిలో 96 లక్షల టన్నుల ధాన్యం పండితే.. తెలంగాణలోనే 56 లక్షల టన్నులు సాగైందన్నారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. బీజేపీ నాయకులు మత రాజకీయాలు చేస్తూ, సీఎం కేసీఆర్పై అవినీతి మరకలు అంటించాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రం లో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పా లిత ప్రాంతాల్లో ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు. వారంలోగా జోగుళాంబ గద్వాల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన ఉంటుందని, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ పట్టణ, గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత కౌన్సిల్ పాలన అవినీతిమయంగా ఉండగా.. నేడు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామనారు. స్థానిక బీజేపీ నాయకురాలు ఈ ప్రాంతానికి టూరిస్టులా వచ్చి.. తన ఉనికి కాపాడుకునేందుకు ప్రెస్మీట్ పెట్టి వెళ్లిపోతుందని ఆరోపించారు. 40 ఏండ్లకు పైగా ఒకే కుటుంబం పాలన కొనసాగించిందని, కానీ ఏనాడూ గద్వాల అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. ప్రజలు పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. రాష్ట్రం లో గద్వాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. అనంతరం పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. అంతకుముందు బీఆర్ఎస్ జెండావిష్కరణ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, వైస్ చైర్మన్ బాబర్, వినియోగదారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ గట్టు తిమ్మప్ప, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్గౌడ్, బూరెడ్డిపల్లి సర్పంచ్, ఎమ్మెల్యే సతీమణి బండ్లజ్యోతి, జములమ్మ, పాగుంట ఆలయ కమిటీల చైర్మన్లు సతీశ్కుమార్, వెంకట్రామిరెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.