గద్వాల, మే 2 : పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కో సం కాంగ్రెస్ మరోసారి మోసపూరిత వాగ్దానాలతో ప్రజల ముందుకు వస్తున్నదని.. వారి మాటలు నమ్మొద్దని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు మద్దతుగా గద్వాల క్యాంప్ కార్యాలయం ఆవరణలో గురువారం ముఖ్య కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. బీర్ఆఎస్ పాలనలో గద్వాల మున్సిపాలిటీ ఎంతో అభివృద్ధి చెందిదన్నారు. ఈనెల 8న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గద్వాలకు రానున్నారని.. పర్యటనను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఉంటే పట్టణాన్ని మరింత అబివృ ద్ధి చేసుకునేవాళ్లమన్నారు. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికల్లో నడిగడ్డపై గులాబీ జెండా ఎగరేసి అభివృద్ధిని కొనసాగిద్దామన్నారు. ఇతర పార్టీలకు గద్వాలలో అవకాశం లేదని.. వారి మోసాలను నడిగడ్డ ప్రజలు పసిగడతారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రవీణ్కుమార్ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి ఇంతియాజ్, మున్సిపల్ వైస్చైర్మన్ బాబర్, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, దౌలు, నరహరి శ్రీనివాసులు, నాయకులు సతీష్కుమార్, రామకృష్ణశెట్టి, గోవిందు పాల్గొన్నారు.