భూత్పూర్, మార్చి 15 : ఈనెల 28వ తే దీన జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో దేవరకద్ర నియోజకవర్గంలోని ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ లు, మున్సిపల్ కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా మాజీ ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ని యోజకవర్గంలో దాదాపు 80శాతం ఎంపీటీసీలు, 100శాతం జెడ్పీటీసీలు బీఆర్ఎస్ పార్టీ కి చెందిన వారే ఉన్నారని వారంతా బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేస్తే నవీన్కుమార్రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు.
అనంతరం ముఖ్యఅతిథిగా హాజరైన గద్వాల ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓ ట్లే ఎక్కువగా ఉన్నాయని, జిల్లా వ్యాప్తంగా అ త్యధిక ఎంపీటీసీలు ఉన్నారని గుర్తు చేశారు. అందరూ కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి న హామీలను మరిచి రోజుకోమాట చెబుతున్నదని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100రోజుల్లోనే ప్రజలనుంచి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి మాట్లాడుతూ నన్ను ఎమ్మెల్సీగా గెలిపించండి పెద్ద నాయకుల నుంచి, సామా న్య కార్యకర్తల వరకు అందుబాటులో ఉండి పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, వనపర్తి జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీలు గుంత మౌనిక, హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.