గద్వాల, సెప్టెంబర్ 28 : మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మైనార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
మైనార్టీల అభ్యున్నతికి కృషి చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మైనార్టీల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారికి చేయూత నిచ్చిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, పీఏసీసీఎస్ చైర్మన్ సుభాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, నాయకులు పాల్గొన్నారు.