గద్వాల, ఏప్రిల్ 15 : నడిగడ్డకు కూతవేటు దూరంలో కృష్ణా-తుంగభద్రా నదులు ప్రవహిస్తున్నా.. కాంగ్రెస్ పాలనలో నడిగడ్డ ప్రజలు తాగు, సాగునీటి కోసం గోస పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్నదని, వీరి కళ్లు తెరిపించడానికి జలదీక్ష చేపట్టినట్లు ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. గద్వా ల ప్రజల దాహార్తిని తీర్చడానికి కర్ణాటకలోని నా రాయణపూర్ డ్యాం నుంచి ఐదు టీఎంసీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే బండ్ల సోమవారం జలదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, బీఆర్ఎస్ నాగర్కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హాజరై సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాటాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి న ఏ ఒక్క హమీ నెరవేర్చలేదన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా ఈ నాలుగేండ్ల ల్లో మరిన్ని ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మీ కోసం మీ తాగునీటి సమస్య తీర్చడానికే తాను ఈ జలదీక్ష చేపట్టానన్నారు. గద్వాల ప్రజల తాగునీటి సమస్య తీరే వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామన్నారు. రైతులు, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలిచ్చి మోసం చేసిందని, వారికి ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చా రు. కార్యక్రమంలో కొల్లాపూర్ ఇన్చార్జి అభిలాష్రావు, ఎంపీపీలు ప్రతాప్గౌడ్, రాజారెడ్డి, విజయ్కుమార్, జెడ్పీటీసీలు పద్మ, రాజశేఖర్, ప్ర భాకర్రెడ్డి, సరోజనమ్మరమేశ్నాయిడు, కౌన్సిలర్లు నాగిరెడ్డి, దౌలు, శ్రీనివాసులు, మురళి, నా యకులు కృష్ణారెడ్డి, వెంకట్రాములు, రామన్గౌడ్, ఉమాదేవి, రాధాకృష్ణారెడ్డి, హనుమంతునాయుడు, వెంకటేశ్, బాబర్, గోవిందు, సాయిశ్యాంరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.