ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రైతురాజ్యం సాధ్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. అమలు కాని హామీలతో కాంగ్రెసోళ్లు ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని సూచించా రు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కేటీదొడ్డి, మల్దకల్ మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్యే బండ్ల సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
గద్వాల, అక్టోబర్ 21 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రైతురాజ్యం సాధ్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్పష్టం చేశారు. అమలు కాని హామీలతో కాంగ్రెసోళ్లు ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో కేటీదొడ్డి మండలం నందిన్నెకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ సర్పంచ్ చిన్నకిష్టప్ప, మాజీ ఎంపీటీసీ లక్ష్మి, మాజీ వార్డు మెంబర్ జనార్దనమ్మతోపాటు 20మంది, మల్దకల్ మండలం దాసరిపల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు సుమారు 60మంది బీఆర్ఎస్లో చేరగా వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు విద్యుత్ గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారన్నారు. రాష్ట్రంలో వారు అధికారంలోకి వచ్చేది లేదు.. వారు ఏ పథకాలకు గ్యారెంటీ ఇచ్చేది లేదన్నారు. అమలు కాని హామీలను కాంగ్రెస్ కర్ణాటకలో ఇచ్చి ఇప్పుడు వాటిని అమలు చేయలేక నానా అవస్థలు పడుతుందని చెప్పారు. వారి మాటలు నమ్మితే మనకు మరోసారి గోస తప్పదన్నారు. రాష్ర్టాన్ని ఎక్కువ కాలం కాంగ్రెస్ పాలించిందని, అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు అధికారంలోకి వస్తే చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు కులం ముసుగులో ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి వస్తున్నారని, బీజేపీ మతం పేరిట ఓట్లు దండుకోవాలని చూస్తుందన్నారు. ఈ రెండు పార్టీలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, సర్పంచ్ భరత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్గౌడ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ఎంపీపీ రామకృష్ణ, నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, సత్యారెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఉరుకుందు, హనుమంతు, యుగంధర్గౌడ్, రంగారెడ్డి, చక్రధర్రావు తదితరులు పాల్గొన్నారు.
గద్వాల అర్బన్, అక్టోబర్ 21 : కేటీదొడ్డి మండలం పా గుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెం దిన నాయకులు, కార్యకర్తలు దాదాపు 200మంది శనివా టరం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో బీఅర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వరాష్ట్రంలో జిల్లా ఏర్పాటుతో గద్వాల నియోజకవర్గాన్ని సుందరవనంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందాయన్నారు. నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేసిన సీఎం కేసీఅర్ రుణం తీర్చుకోవాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వన్ని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తి మ్మప్ప, ఎన్నికల ఇన్చార్జి రాకేశ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ, నాయకులు ఉరుకుందు, హ న్మంత్, నాగర్దోడ్డి వెంకట్రాములు, విక్రమ్సింహారెడ్డి, నవీన్కుమార్రెడ్డి, యుగంధర్గౌడ్ తదితరులున్నారు.