దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), నవంబర్ 22 : ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు మరింత లబ్ధ్ది చేకూరేవిధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించారని, దాని వల్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆలవెంకటేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కౌకుంట్ల మండలంలోని వివిధ గ్రామాల్లో ఆయన ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పార్టీకార్యకర్తలు, మహిళలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించి కారుగుర్తుకు ఓటువేయాలని కోరారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ను మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని, ప్రజల ఆశీర్వాదం కోరుతున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టోతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ ఫలం అందుతుందని తెలిపారు. ఇతర పార్టీల అభ్యర్థులు అవగాహన రాహిత్యంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధ్ది కనబడుతలేదా అని ప్రశ్నించారు. మేము చేసిన పనులు కాంగ్రెస్ వచ్చిన తరువాత చేస్తామని చెప్పడం వారికే చెల్లిందన్నారు. వ్యవసాయానికి మూడు గంట కరెంటు చాలన్న రేవంత్రెడ్డిని, వారి అభ్యర్థులను తె లంగాణ నుంచి తరిమేందు కు ప్రజలు సిద్ధ్దంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో స ర్పంచ్ శివరాజు, మండల నాయకులు, సర్పంచులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర, నవంబర్ 26: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి వివిధ పార్టీల నుంచి బీఅర్ఎస్లో చేరడం జరుగుతుందన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అదివారం మండలంలోని బస్వాయిపల్లి, జీన్గురాల తదితర గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల సమక్షంలో బీఆర్ఎస్లో చేరా రు. వారికి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వా నించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ నాయకులు చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. ప్రజలు వారి మాటాలు నమ్మకపోవడంతో బీఆర్ఎస్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో అధికారంలో ఉన్నపుడు అభి వృద్ధి చేయని వారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎం చేస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రతి గ్రా మంలో తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహ కారంతో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కాటం ప్రదీప్కుమార్గౌడ్, భగ వంత్ గౌడ్, రంజిత్ గౌడ్, జెట్టి నర్సింహారెడ్డి, కర్ణం రా జు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట, నవంబర్ 26: మండలంలోని పామా పురం గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం రాత్రి సింగిల్ విండో చైర్మన్ వాసుదేవారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో వార్డు సభ్యులు కావాలి ఈశ్వరయ్య, వాకిటి రజిత, నా యకులు అనిల్కుమార్, సునీల్గౌడ్, సురేష్గౌడ్, మహేశ్, రాజేశ్, శివ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్, ఉమా మహేశ్వర్రెడ్డి, హరిచంద్రారెడ్డి, గోపాల్, రాఘవేందర్గౌడ్, గో విందునాయుడు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.