భూత్పూర్, మార్చి 23 : ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోలేరని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామానికి చెందిన వంద మంది బీజేపీ, కాంగ్రెస్ నేతలు హైదరాబాద్లో ముడా డైరెక్టర్ సాయిలు ఆధ్వర్యంలో ఎ మ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీ లేదన్నారు.
సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి బీఆర్ఎస్లోకి క్యూ కడుతున్నారన్నారు. రాష్ర్టాన్ని అన్ని రం గాల్లో అభివృద్ధి చేస్తుంటే.. కేంద్రం కావాలనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు కేసులు పెట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నదన్నారు. పార్టీలో చేరిన వారిలో డోకూ రు శంకర్, దుబాయి కృష్ణయ్య, నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు నవీన్, రాజేశ్, అరవింద్, కల్యాణ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యు డు అజీజ్, కౌన్సిలర్ రామకృష్ణ, నాయకులు శివరాజు, సత్యం తదితరులు పాల్గొన్నారు.