భూత్పూర్, ఫిబ్రవరి 6 : ప్రజాసంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. మండలంలోని కొత్తమొల్గరలో రూ.20లక్షలతో చేపట్టిన గ్రామ పంచాయతీ భవనం, రూ.10లక్షలతో చేపట్టిన సీసీరోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనతోపాటు వె ల్కిచర్ల ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మనబడి’ లో భాగంగా రూ.38లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, కిచెన్షెడ్డు, తాగునీటి నల్లాలు, డ్యూయల్ డెస్క్ బెంచీలను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన తాగునీటి నల్లాలను, తరగతి గదిలోని డ్యూయల్ డెస్క్ బెంచీలను పరిశీలించారు. అనంతరం వెల్కిచర్ల, పాతమొల్గరలో గ్రామ పంచాయతీ భవనం, సీసీరోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు విధి గా పంపాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉంటారని, నాణ్యమైన బోధన లభిస్తుందన్నారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రజా సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకొని సీఎం కేసీఆర్ పథకాలను అమలుచేస్తున్నారన్నారు. మన పథకాలను చూసి తమ రాష్ర్టాల్లోనూ ఇలాంటి సంక్షేమాన్ని అమలు చేయాలని, లేకుంటే ని యోజకవర్గాలను తెలంగాణలో కలపాలని ఆయా రాష్ర్టాల్లోని ఎమ్మెల్యేలు కోరుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, ఎంపీడీవో మున్ని, వైస్ ఎంపీపీ నరేశ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సురేశ్గౌడ్, సర్పంచులు వెంకటమ్మ, పద్మ, ఎంపీటీసీ పద్మ, ఎంఈ వో నాగయ్య, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయి లు, బీఆర్ఎస్ నాయకులు నారాయణగౌడ్, సత్యనారాయణ, దర్శన్, నారాయణ, గౌస్, నాగయ్య, సత్యం, శంకర్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.