మూసాపేట, నవంబర్1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం వలసలను నిరవారించుకున్నామని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని స్పూర్తి తాండాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందరబంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముం దు మన రాష్ట్రం నుంచి 14లక్షల మంది బొంబాయి లాంటి ప్రాంతాలకు వలసలు వెళ్లేవారని రాష్ట్రం ఏర్పడినంతరం ఇతర రాష్ర్టాల నుంచి మన రాష్ర్టానికే వలసలు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేశారని అన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో వస్తేనే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే అనంతరం చక్రాపూర్, కనకాపూర్తాండా, జానంపేట గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఎమ్మెల్యే కు అడుగడునా పూలవర్షం కురిపిస్తూ నీరాజనం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహాయాదవ్, సర్పంచులు లలిత, శైలజా, శ్రీనివాసులు, నర్సిములు, ఎంపీటీసీలు నక్క అంజనేయులు, పల్లవి, బీఆర్ఎస్ నాయకులు నర్సింహ్మారెడ్డి, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కొత్తకోట, నవంబర్1: పట్టణంలోని 4,5,8 వార్డులలో బుధవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సతీమణి ఆల మంజుల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు,మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని పేద మహిళలకు రూ.400లకే సిలిండర్, సౌభాగ్య లక్ష్మి పథకం, సన్నబియ్యాన్ని అందిస్తుందన్నారు. అలాగే రైతులకు రైతుబంధు పెంపు, అగ్రవర్ణ పేదాలకు గురుకుల పాఠశాలలు నెలకొల్పనుందన్నారు. ఇవే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందనిన అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, ఎంపీపీ గుంతమౌనిక, వైస్ చైర్పర్సన్ జయమ్మ, కౌన్సిలర్లు సంద్య, పద్మ, పట్టణ పార్టీ అధ్యక్షుడు బాబురెడ్డి, బాలకృష్ణ, నిర్మలారెడ్డి, భీమా ప్రసన్నలక్ష్మి, సు జాత,నాగన్నసాగర్, వహిద్, మీసేక్, శ్రీనుజీ, బాలకృష్ణారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట(అడ్డాకుల), నవంబర్1: నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని అడ్డాకుల జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్రెడ్డి, ఎంపీపీ దోనూరు నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని శాఖాపూర్ గ్రామంలో బుధవారం కారు గుర్తుకు ఓటు వేయాలని వారు స్థానిక నాయకులతో పాటు కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యేగా ఆల వెంకటేశ్వర్రెడ్డి గెలుపు ఖాయమని, కానీ నియోజకవర్గంలో నే అడ్డాకులలో అత్యధిక మెజార్టీ రావాలని వారు కోరారు. అందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో ఛైర్మన్ జితేందర్రెడ్డి, గ్రామ సర్పంచ్ జయన్నగౌడ్, ఎంపీటీసీల సంఘం మండలాధ్యక్షుడు రంగన్నగౌడ్, కందూరు ఆలయ ఛైర్మన్ రమేష్గౌడ్, భాస్కర్నాయడు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు పాల్గొన్నారు.
దేవరద్ర, నవంబర్ 1: బడుగు బలహీన వర్గాల అభివృద్ధే బీఆర్ఎస్ ధ్యేయమని ఎంపీపీ రమాదేవి, మండలఅధ్యక్షుడు జేట్టి నర్సింహరెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాలల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి గడపగడపకు తిరుగుతు నియోజకవర్గంలో అభివృద్ధికృషి చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికు పట్టం కట్టాలని సూచించారు. ఈ సందర్బంగా వారు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాట్లాడుతూ మండలంలో గత పాలనలో ఎమాత్రం అభివృద్ధికి నోచ్చుకోలేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సహకరంతో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి చెక్డ్యాంల నిర్మాణం చేయడంతో భూగర్బజలాలు పెరిగాయన్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దేవరకద్ర రూరల్(కౌకుంట్ల), నవంబర్ 1: కౌకుంట్ల, చిన్న చింతకుంట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బుదవారం కారు గుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మండల బీఆర్ఎస్ కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివ్రుద్ది చేసిన పనులు, సంక్షేమ పథకాలు గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజేశ్వరీ, మండల పార్టీ అద్యక్షులు కోట రాము, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మదనాపురం, నవంబర్ 1 : రాష్ట్రంలో అమలౌతున్న సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి మళ్ళి తీసుకువస్తుందని బీఆర్ఎస్ పార్టీ కొన్నూరు గ్రామాధ్యక్షుడు అచ్యుత రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వివిధ గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అచ్యుత రెడ్డి మాట్లాడుతూ గతంలో సామాన్య ప్రజల గురించి ఏఒక్క ప్రభుత్వం ఆలోచించలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతనే సామాన్యుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని పేర్కొన్నారు. మళ్ళి అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీయే వస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా
భూత్పూర్,నవంబర్1: పట్టణంలోని 1వ వార్డులో సిద్దాయపల్లిలో డబుల్బెడ్ రూం ఇండ్ల వద్ద బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అమిస్తాపూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గెలిస్తేనే పేద ప్రజల సమస్యల పట్ల దృస్టి సారిస్తాడని, ముఖ్యమంత్రి కేసీఆర్తో గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ముడా డైరెక్టర్ సాయిలు అన్నారు. అందరు కారు గుర్తుకే ఓటు వేసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ బాలకోటీ, కో ఆప్షన్ అజీజ్, బీఆర్ఎస్ నాయకులు బాలస్వామి, వెంకటేష్, రమేశ్, రహమత్, రవి తదితరులు పాల్గొన్నారు.