మహబూబ్నగర్ : కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకునేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అడ్డాకుల మండలం శాకపూర్ గ్రామానికి చెందిన ఎండీ అలీ ప్రమాదశవత్తు చెరువులో పడి మరణించాడు.
అతనికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో అతడి భార్య జహంగీర్బీకి టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయల చెక్కును స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీలోనే ప్రతి కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్ధానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.