కొత్తకోట, నవంబర్ 30 : తమకు విద్యాబుద్ధులు నే ర్పిన పాఠశాల శిథిలావస్థకు చేరుకోవడంతో పూర్వ వి ద్యార్థుల మనస్సు చలించింది. పాఠశాలలో తమ జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని సంకల్పించుకున్నారు. కొత్తకోట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1973-74 లో చదివిన టెన్త్ క్లాస్ విద్యార్థులు అ‘పూర్వ’ కట్టడం ని ర్మించేందుకు పూనుకున్నారు. పాఠశాల శిథిలావస్థకు చే రుకోవడంతో దానిని తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీనికితోడు ‘మన బస్తీ-మన బడి’కి నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వ సంకల్పానికి తాము కూ డా చేదోడువాదోడుగా నిలవాలని 24 మంది పూర్వ వి ద్యార్థులు రెండు గదులను నిర్మించేందుకు ముందుకొచ్చారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి పిలుపుమేరకు రూ.14 లక్ష లు వెచ్చించి గదుల నిర్మాణాన్ని పూర్తి చేశారు. వా రంతా కలిసి గుత్తేదారుడికి ఇవ్వకుండా.. స్వయంగా అక్కడే ఉండి పనులను పర్యవేక్షించారు. రెండు నెలల్లోనే గదులను పూర్తి చేశారు. సత్యనారాయణశెట్టి రూ.3 లక్షలు, కీర్తిశేషులు గోపాల్ కుమారుడు రూ.3.5లక్షలు విరాళంగా ఇచ్చారు. దామోదర్రెడ్డి, బుచ్చన్న, జలేందర్గౌడ్, ఎండీ.ఖయ్యూం, ఆర్.రాంచంద్రయ్య, నరోత్తంరెడ్డి కొంత జమచేశారు. పాఠశాల అదనపు గదులను గురువారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రారంభించనున్నారు.