మూసాపేట(అడ్డాకుల), నవంబర్ 24 : దేవరకద్ర గడ్డపై మూడో సారి కూడా గులాబీ జెండానే ఎగురు తుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అడ్డాకుల మం డలం కందూరు, సుంకరామయ్యపల్లి, పొన్నకల్, రాచా ల గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 55 యేండ్లు పాలించి ఏం చేయకపోయినా పదేండ్లలో సబండవర్గాలను అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్, నన్ను తిడుతూ మాటల గారడీ చేస్తూన్నారని, వారి మాటలను నమ్మి మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ నా యకులు ఉత్తం కుమార్రెడ్డితో పాటు పలువురు కాం గ్రెస్ పార్టీ నాయకులు రైతుబంధు, రైతురుణ మాఫీ, సబ్సిడీ గొర్రెలు ఇవొద్దని ఈసీకి ఫిర్యాదు చేయడంతో నిలిచి పోయాయన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికీ సబ్సీడి గొర్రెలు ఇప్పించే బాధ్యత నాదేనన్నారు. గత ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గంలోనే అత్యధికంగా 1200 మెజార్టీ ఇచ్చి ప్రథ మ స్థానంలో కందూరు గ్రామస్తులు నిలిచారని, మరో సారి ఆమెజార్టీ తగ్గకుండా బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. నాడు వలసలు పోయేటోళ్లం మనం.
స్వరా ష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధితో వలసలు ఆగి మన ప్రాంతానికే వలసలోస్తున్నారంటే మనం బాగుపడ్డట్టా కాదా ప్రజలే ఆలోచించాలన్నారు. అందుకు మేం ప్రతి గ్రామంలో చేసిన అభివృద్ధిని లెక్కలతో సహా చెప్తున్నామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎలాగైనా సరే ఓట్లు వేయించుకోవాలనే కుట్రతో తప్పు డు ప్రచారం చేస్తున్నారే తప్ప వారు ఎలాంటి గ్యారెంటీలు అమలు చేయలేరన్నారు. అందుకు నిదర్శనం కర్ణాటకలో 3 నెలలకే ఆరు గ్యారెంటీలను ఎత్తేసినట్లు చెప్పారు. మీరు వేసే ప్రతి ఓటు ఐదేండ్ల భవిషత్తు ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ గతాన్ని గుర్తు చేసుకోని ఏది మంచి ఏది చెడో గుర్తించిన తర్వాత ఓటువేయాలని కోరారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, మాజీ జడ్పీటీసీలు కాటం ప్రదీప్కుమార్గౌడ్, బాలమణెమ్మతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు మాట్లాతూ దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చేసిన అభివృద్ధిని వివరిస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా వివిధ పార్టీల కు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే ఆల గులాబీ కుండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మదనాపురం, నవంబర్ 24 : రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. శుక్రవారం కొన్నూరు గ్రా మానికి చెందిన రఫిక్, అజ్జు, కాకిరాము, నందిమల్ల శివ, వెంకటేష్, వాకిటి కురుమన్న, తరుణ్, రాజు, శివతేజ, ప్రవీణ్, శంకర్, చంద్రశేఖర్, భరత్, మహేశ్, భీంరాజు, కాశితో పాటు 100 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కాటం ప్రదీప్కుమార్గౌడ్, దేవరకద్ర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జయంతి, మాజీ జెడ్పీటీసీ బాలమనెమ్మ, ఎంపీటీసీ శరత్రెడ్డి, సర్పంచ్ జగన్, గ్రామాధ్యక్షుడు అచ్యుతరెడ్డి, మహేశ్, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు