కొత్తకోట, నవంబర్ 20: గౌడకులస్తుల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీపీఆర్ గార్డెన్లో నియోజకవర్గ గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకుడు ప్రదీప్కుమార్గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గౌడ కులస్తులకు సమూచిత స్థానం లేదని, ఎదుటి వ్యక్తిని కించపరిచే దొరణి కాంగ్రెస్ నేతల స్వభామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు చేయూతనిచ్చిందని, గౌడ కులస్తులకు నామినెట్ పదవులతో పాటు మరెన్నో పదవులిచ్చి సమూచిత స్థానం కల్పించిందన్నారు. కర్నాటకలో ఆరు నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం వెలికిలపడిందని, మనం కాంగ్రెస్కు ఓటేస్తే ఇక్కడి రైతాంగం చీకట్లోకి వెళ్తారన్నారు. కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలను ఆపలేదని, అలాంటి ప్రభుత్వానికి గౌడ సోదరులు అండగా నిలువాలన్నారు. వ్యక్తిత్వం లేని వ్యక్తులకు ఓటేస్తే మన పాపం కొనితెచ్చుకున్నట్లే అవుతుందన్నారు. అంతకు ముందు ప్రదీప్కుమార్గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తుకు జీఎంఆర్ కించ పరిచే దొరణిలో మాట్లాడారని అలాంటి వ్యక్తిని ప్రజల మధ్య ఉండనివ్వకూడదన్నారు. అనంతరం గౌడ కులస్తులచే కేసీఆర్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యే ఆలన్నకు అండగా ఉండాలని కారు గుర్తు కు ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరంసీసీకుంట మండలం ఉంద్యాల గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రదీప్కుమార్గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. అలాగే దేవరకద్ర మం డలం నార్లోనికుంట గ్రామానికి చెందిన 50 మంది కాం గ్రెస్ నేతలు ఎమ్మెల్యే సమక్షంలో ఈఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్, మున్సిపల్ చైర్మన్ బస్వరాజుగౌడ్, ఎంపీపీ గుంతమౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, శ్రీనుజీ, వెంకటేశ్వర్రెడ్డి,శ్రీనివాస్గౌడ్, రాఘవేందర్గౌడ్, నర్సింహాగౌడ్, తిరుపతయ్యగౌడ్, భాగ్యమ్మ, శేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే ఎక్కడ లేని సంక్షే మ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేస్తూ రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవా రం రాత్రి పట్టణంలోని 13,14,15,11,6,7,8 వార్డుల్లో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలోని బీమా పథకం పేద ప్రజలకు వరమని, సౌభాగ్యలక్ష్మి, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయునుందన్నా రు. పట్టణానికి రూ.50 కోట్ల నిధులు తెచ్చి అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, కౌన్సిలర్లు పద్మ, రామ్మోహన్రెడ్డి, అయ్యన్న, సంద్య, నాగన్నసాగర్, తిరుపతయ్య, రవీందర్రెడ్డి, యాదగిరియాదవ్, రాజుయాదవ్, బాలకృష్ణారెడ్డి, ఖాజమైనుద్దీన్, వసీంఖాన్, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.
మదనాపురం, నవంబర్ 20 : మండలంలోని నర్సింగాపురం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సమక్షంలో చిన్నచింతకుంట మండలం అల్లీపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రామూర్తి, మాసన్న, గొల్లరాజు, గోవర్దన్, కురుమన్న, వెంకటన్న తదితరులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే ఆల వెంకట్వేర్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్లో చేరుతున్నా రన్నారు.