భూత్పూర్, నవంబర్ 1 : ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. పట్టణంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో బుధవారం పూజలు చేశారు. సెంటిమెంట్ ప్రకారం.. నియోజకవర్గానికి ఈశాన్య దిక్కున ఉన్న తాటిపర్తి గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి.. కొత్తూర్, పెద్దతండా, కరివెన గ్రామాల్లో పర్యటించారు. తాటిపర్తిలో సర్పంచ్ వెంకటయ్య, నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్దే విజయమని, అధికారంలోకి వచ్చిన వెంటనే మ్యానిఫెస్టోలో ఉన్న వాటిని అమలుచేస్తామన్నారు.
ప్రజలకు సాగునీటి గోసను తీర్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టామన్నారు. సీఎం కేసీఆర్ రూ.3,300 కోట్లతో దేవరకద్ర నియోజకవర్గానికి కరివెన ప్రాజెక్టును మంజూరు చేశారన్నారు. 19.5 టీఎంసీల ప్రాజెక్టును నిర్మించడం చాలా గొప్ప విషయమన్నారు. కర్ణాటకలో వ్యవసాయానికి కేవలం 5 గంటల కరెంట్ను ఇవ్వడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే మూడు గంటల కరెంట్ వస్తుందని వివరించారు. అంతకుముందు ఎమ్మెల్యేకు ప్రతి గ్రామంలో మహిళలు, యువకులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్గౌడ్, ఎంపీపీ శేఖర్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నర్సింహాగౌడ్, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, సర్పంచులు వెంకటయ్య, యాదయ్య, సాలి, జహంగీర్బీ, శేఖర్, కౌన్సిలర్లు శ్రీనివాస్రెడ్డి, బాలకోటి, రామకృష్ణ, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్గౌడ్, సాయిలు, కో ఆప్షన్లు అజీజ్, జాకీర్, నాయకులు నారాయణగౌడ్, సత్యనారాయణ, మురళీధర్గౌడ్, అశోక్గౌడ్, వెంకట్రాములు, రాములు, ప్రేమ్కుమార్ పాల్గొన్నారు.