మహబూబ్నగర్ : జిల్లాలోని అడ్డాకుల మండలం తిమ్మాయపల్లి తండాకు దేవరకద్ర
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల నుంచి బస్సు సౌకర్యానికి నోచుకోని తండాకు స్సు సర్వీసు మొదలు కావడంతో గిరిజనులు సంబురాలు జరుపుకున్నారు.
పాఠశాల, కళాశాలలకు వెళ్లే తమ గిరిజన బిడ్డలకు బస్సు సర్వీసు వల్ల చాలా మేలు జరుగుతుందని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే ఆల..
తిమ్మాయపల్లి తండాకు బస్సు సర్వీసును ప్రారంభించిన అనంతరం కాటవరం స్టేజి నుంచి తండా వాసూలు, ప్రయాణికులతో కలిసి తిమ్మాయపల్లి తండా వరకు టికెట్టు కొనుగోలు చేసి అదే బస్సులో ప్రయాణించి తండా వాసుల్లో ఆనందం నింపారు. బస్సు తండాకు చేరుకోగానే గిరిజనులు తమ సంప్రదాయ నృత్యాలతో ఘనంగా స్వాగతం పలికారు.