ఇటిక్యాల, జనవరి 31: గత పాలకుల మాదిరిగా తాను ఉత్తి మాటలు చెప్పనని.. చెప్పిన పని చేసి చూపుతానని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని చాగాపురం గ్రామంలో రూ.16లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించడంతోపాటు రూ.10లక్షలతో నిర్మించనున్న సీసీరోడ్డు పనులకు మంగళవారం భూమిపూజ చేశారు. అనంతరం గ్రామంలోని రైతువేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తానన్నారు. నియోజక వర్గంలో తాను గెలుపొందాకే రోడ్లన్నీ బాగుచేయించానన్నారు. పల్లె దవఖానను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీడీవో స్రవంతి, ఎంపీటీసీ చెన్నుపాటి రాముడు, సర్పంచులు గోవర్ధన్రెడ్డి, వీరన్న, సుంకన్న, రాముడు, గ్రంథాలయ సంస్థ జిల్లా సభ్యుడు గుమ్మ గోవర్ధన్, మాజీ ఎంపీపీ నాగన్గౌడ్, నాయకులు వెంకటన్న, సుంకన్న, సూరి, చంద్రాగౌడ్, వైద్యసిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.