అలంపూర్/ఉండవెల్లి, మార్చి 25 : బీఆర్ఎ స్ ప్రభంజనం ముందు ప్రతిపక్షాల అడ్రస్ గల్లంతవుతుందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. ఉండవెల్లి మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నా యకులతో శనివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ బీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది సభ్య త్వం ఉందన్నారు. సీఎం కేసీఆర్ అలంపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి లో విద్య అందుతుందన్నారు. మన ఊరు-మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ర కాల మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు.
అలంపూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై రూ.23కోట్లతో వంద పడకల దవాఖాన నిర్మా ణం, నియోజకవర్గంలో 51 పల్లె దవాఖానలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. పార్టీలకతీతంగా ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా నల్లా కనెక్షన్ ఇచ్చామన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మకుండా.. బీఆర్ఎస్ పార్టీకి హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలని ప్ర జలను కోరారు. అన్ని వర్గాల ప్రజల కోసం పాటుపడుతున్న వారికే ఓటేయాలని పిలుపుని చ్చారు. అనంతరం జెడ్పీచైర్పర్సన్ సరిత మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అం దరినీ కలుపుకొనేలా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించి.. గ్రామస్థాయి నుంచి అసెంబ్లీ వరకు పదవులు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రిదేనన్నారు. పదువులున్నా.. లేకున్నా కార్యకర్తలు పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ భీసమ్మ, వైస్ ఎంపీపీ దేవన్న, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణ, సర్పంచు సంఘం మండలాధ్యక్షుడు లోకేశ్వర్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.