రాజోళి, ఫిబ్రవరి 27: చివరి తడి వర కూ సాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల వద్ద మోటర్లను ఆయన సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ని లుస్తున్నదన్నారు. రైతుల సంక్షేమానికి అనేక పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. నడిగడ్డ రైతుల బాధలు చూసిన కేసీఆర్ తుమ్మిళ్ల ఎత్తిపోతలతో ఏడాదిలో రెండు పంటలు సాగు చేసుకు నే అవకాశం కల్పించారని చెప్పారు. ప్రతిపక్షాలకు చేతగాక తు మ్మిళ్ల ఎత్తిపోతలపై ప డి ఏడుస్తున్నారని ఎద్దే వా చేశారు. తుమ్మిళ్ల ఎత్తిపోతలకు తుంగభద్ర న ది నుంచి ఓపెన్ కెనాల్కు నీ రు అందంకుండా అడ్డంగా ఉన్న రాళ్లు, చెత్తను తొలగించి మోటర్లను ప్రారంభించామని చెప్పారు.
ఆంధ్ర ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి కేసీ కెనాల్కు రోజుకు 1000 క్యూసెక్కులకు మించి తరలిస్తున్న నీటిలో ఔట్ఫ్లో 300 క్యూసెక్కులు త గ్గించి తుమ్మిళ్ల ఎత్తిపోతలకు సహకారించాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు నీరు అందిచేందుకు కృషి చేస్తునారన్నా రు. అధికారులు మాట్లాడుతూ ప్రస్తు తం తుమ్మిళ్ల జీరో ఫాయింట్ వద్ద 29 1.5 అడుగుల నీటినిల్వతో మోటర్లను ప్రారంభించినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఏపీ అధికారులతో మాట్లాడి 5వ ఇం డెట్ ఉమ్మడి పెట్టారని, ఈ ఇండెట్తో మార్చి 15వ తేదీ వరకు నీటి సమస్య ఉండదన్నారు. 6వ ఇండెట్ కూడా మ నకు అవకాశం ఉందని అధికారులు తె లిపారు. కార్యక్రమంలో ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి, బీఆర్ఎ స్ యువ నాయకుడు అజయ్కుమార్, వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశపోగు రాజు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.